Evaru Meelo Koteeswarulu: ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వాయిదా పడనుందట..!

  • April 30, 2021 / 06:44 PM IST

పాపం 3 ఏళ్ళుగా తమ అభిమాన హీరో సినిమా చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కానీ రాజమౌళి.. ‘ఆర్.ఆర్.ఆర్’ ను ఎంత వేగంగా ఫినిష్ చెయ్యాలని ప్రయత్నించినా ఏదో ఒక ఆటంకం వచ్చి షూటింగ్ ఆగిపోతుంది. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా అక్టోబర్ నెలలో విడుదల కావాల్సిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం 2022 సంక్రాంతికి వాయిదా పడిందని కొందరు చెబుతుంటే.. మరికొందరు మాత్రం ఏకంగా 2022 సమ్మర్లో రిలీజ్ అవుతుందని చెప్పుకొస్తున్నారు.

ఇక్కడ విడుదల వాయిదా పడింది అనేది మాత్రం సత్యం. సరే కనీసం ఎన్టీఆర్ ను బుల్లితెర పై అయినా చూసే అవకాశం దక్కింది కదా అని మొన్నటికి మొన్న ఎన్టీఆర్ అభిమానులు సంబరపడితే.. ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరేలా కనిపించడం లేదు. మే నెలలో ప్రారంభం కావాల్సిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో వాయిదా పడనుందట. కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ కారణంగా భారీగా కేసులు నమోదు అవుతుండటంతో ఇప్పుడు షూటింగ్ నిర్వహించడం రిస్క్ అని భావిస్తుందట యాజమాన్యం.

ఈ షోకి జనాలు కూడా కావాలట..! అందుకే ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసి సరిపెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రోమోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. మార్చి 13న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో అనౌన్స్మెంట్ చేశారు నిర్వాహకులు. జెమినీ టీవీలో ఇది ప్రసారం కావాల్సి ఉంది. ఈ షో కోసం ఎన్టీఆర్ ఏకంగా 7 కోట్ల పారితోషికంగా తీసుకున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus