Chiranjeevi: చిరంజీవిపై కేఏ పాల్ ఫైర్.. పాల్ ను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

  • June 24, 2023 / 02:30 PM IST

చరణ్ ఉపాసనలకు పండంటి పాప జన్మించడంతో మెగా అభిమానులు తెగ సంతోషిస్తున్నారనే సంగతి తెలిసిందే. అయితే చరణ్ ఉపాసనల కూతురు గురించి వెబ్ మీడియా మరీ ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిందని కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే చరణ్ ఉపాసన కుటుంబాలకు ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉండటం వల్లే మెగా ప్రిన్సెస్ కు సంబంధించి ఊహించని స్థాయిలో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. మెగా ప్రిన్సెస్ ఫోటో ఇదేనంటూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినా వైరల్ అయిన ఫోటోలు రియల్ కాదని మెగా ఫ్యాన్స్ నుంచి క్లారిటీ వచ్చింది.

అయితే చిరంజీవి (Chiranjeevi) మనవరాలుకు మీడియా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడంతో కేఏ పాల్ చిరంజీవి ఫ్యామిలీపై, చిరంజీవిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. చిరంజీవికి మనవరాలు పుడితే న్యూసా.. దగ్గితే న్యూసా అని ఆయన చెప్పుకొచ్చారు. 2008 సంవత్సరంలో చిరంజీవి పార్టీ పెట్టి 2011 సంవత్సరంలో పార్టీని విలీనం చేయడం జరిగిందని పార్టీ ఎమ్మెల్యేలు టికెట్లు కొనుక్కొని నష్టపోయారని ఆయన చెప్పుకొచ్చారు. చిరంజీవి మహారాజులా ఉన్నాడని మనవరాలు పుడితే న్యూస్.. చిరంజీవి తుమ్మితే దగ్గితే అది కూడా న్యూస్ అంటూ కేఏ పాల్ ఫైర్ అయ్యారు.

పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేయాలని కేఏ పాల్ పిలుపునిచ్చారు. నా పార్టీ అధికారంలోకి వస్తే 50 లక్షల కోట్ల రూపాయలు తేగలనని ఆయన పేర్కొన్నారు. అయితే చిరంజీవిపై కేఏ పాల్ నెగిటివ్ కామెంట్లు చేయడంతో చిరంజీవి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. పండున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అని చిరంజీవి, పవన్ లను టార్గెట్ చేస్తే పాపులారిటీ వస్తుందని భావించి నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి తన మంచితనంతో పేరు సంపాదించుకున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus