Mahesh Babu, Pawan Kalyan: మహేష్ బాబు తో అంత ర్యాపో లేదు: కాదంబరి కామెంట్స్

  • June 8, 2022 / 12:18 PM IST

టాలీవుడ్ నటుడు కాదంబరి కిరణ్ అందరికీ సుపరిచితమే.కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన 270 కి పైగా చిత్రాల్లో నటించారు. బుల్లితెరపై కూడా పలు షోలు, సీరియల్స్ చేసి క్రేజ్ ను సంపాదించుకున్నారు. ‘మనం సైతం’ అనే సంస్థను ఏర్పాటు చేసి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నటుడు కాదంబరి.మా(‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’) సభ్యుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో కాదంబరి ‘రాజ రాజ చోర’ ‘థాంక్యూ బ్రదర్’ ‘నారప్ప’ ‘భీమ్లా నాయక్’ వంటి సినిమాల్లో నటించారు.

ఇదిలా ఉండగా.. తాజాగా ఈయన మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ల పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఇటీవల ఈయన సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ షోకి వచ్చారు. ఈయనతో పాటు జోగి బ్రదర్స్, రాగిణి కూడా కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు. ఇక గేమ్ లో భాగంగా సుమ..కాదంబరిని.. ‘ఎవరితో గడిపిన క్షణాలు మధురం అని చెబుతారు?’ అంటూ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు అనే రెండు ఆప్షన్లు ఇచ్చింది.

ఈ ప్రశ్నకి కాదంబరి సమాధానమిస్తూ.. “మహేష్ బాబుతో కంటే కూడా పవన్ కళ్యాణ్ తో గడిపిన క్షణాలే మధుర క్షణాలు. పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఎక్కువ సినిమాలు చేశాను. నేను నడుపుతున్న ‘మనం సైతం’ ఫౌండేషన్ ను ఆయన మనసుకి దగ్గరగా తీసుకున్నారు.ఇంకొకటి ఏంటంటే.. ఆయన హైదరాబాద్ లో ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు 18 మంది గెస్టులని పిలిచారు. అందులో నేను కూడా ఒకడిని.

అది ‘మనం సైతం’ వలన వచ్చిన గుర్తింపు అని త్రివిక్రమ్ సర్ కూడా చెప్పారు ఆ రోజు.నన్ను చూసిన వెంటనే ఇతను జనం గురించి బ్రతికే మనిషి ఇతను అని రికగ్నైస్ చేసే హీరోల్లో అతను ఒకడు. మహేష్ బాబుతో కలిసి సినిమాలు చేశాను. కానీ అంత ర్యాపో లేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత జోగి బ్రదర్స్ లో ఒకరైన వ్యక్తి.. ‘మహేష్ బాబు పెద్దగా ఎవ్వరితోనూ మాట్లాడడు’ అంటూ కౌంటర్ వేశాడు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!


విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus