కళ్యాణ్ రామ్ కెరీర్ కు ఈ ‘మైత్రి’ అవసరమే..!

  • February 15, 2021 / 06:38 PM IST

‘మైత్రీ మూవీ మేకర్స్’..టాలీవుడ్లో ఇప్పుడు లీడింగ్ సంస్థగా దూసుకుపోతుంది. మొదటి చిత్రం ‘శ్రీమంతుడు’ తోనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ను సొంతం చేసుకున్న ఈ సంస్థ.. ఆ వెంటనే ‘జనతా గ్యారేజ్’ ‘రంగస్థలం’ వంటి చిత్రాలతో కూడా అదే జోరుని కొనసాగించింది.అయితే మొదట్లో మీడియం రేంజ్ సినిమాలను అశ్రద్ధ చేస్తూ వస్తున్నారనే విమర్శలను ఎదుర్కొన్న ఈ సంస్థ.. ఆ తరువాత నుండీ మళ్ళీ స్పీడ్ పెంచింది. తాజాగా ‘ఉప్పెన’ అనే మీడియం రేంజ్ సినిమాతో భారీ వసూళ్లను అందుకుంటుంది ఈ సంస్థ.

2ఏళ్ళల్లో 12సినిమాలను ప్లాన్ చేసింది ‘మైత్రి’. ఈ నిర్మాతలు ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటి బడా హీరోల సినిమాలను లాక్ చేశారు. విజయ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్లతో కూడా సినిమాలు చెయ్యడానికి రెడీ అయిపోయారు. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చెయ్యాలని కూడా ప్లాన్ చేశారు. కె.జి.ఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి దర్శకుడు. అయితే త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాకే.. ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు చేస్తాడు.

అయితే ఎవ్వరూ ఊహించని విధంగా ఈరోజు ఎన్టీఆర్.. అన్న కళ్యాణ్ రామ్ తో ఓ చిత్రాన్ని ప్రారంభించేసింది ‘మైత్రి’. అసలు ముందు నుండీ ఈ ప్రాజెక్టు కి సంబంధించి ఎటువంటి వార్తలు రాలేదు. చాలా సైలెంట్ గా ఈ కాంబో సెట్ అయిపోయింది. రాజేంద్ర అనే యువ దర్శకుడు ఈ ప్రాజెక్టుని తెరకెక్కించనున్నాడు.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus