నాకు ఆఫ్‌ స్క్రీన్‌ అయితే సరిపోతుందనుకున్నా – కల్యాణి ప్రియదర్శన్‌

  • July 6, 2018 / 01:04 PM IST

మలయాళ ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజిల కుమార్తె కళ్యాణి ప్రియదర్శన్ తొలి సినిమాతోనే తెలుగువారి మనసులు గెలుచుకుంది. హలో సినిమాలో అక్కినేని అఖిల్ కి జోడిగా నటించి అందరితో అభినందనలు అందుకుంది. ప్రస్తుతం సుధీర్‌ వర్మ దర్శకత్వంలో నటిస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ కి సరసన కనిపించనుంది. ఈ సినిమాలో షూటింగ్ లో తాజాగా పాల్గొంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో అనేక ఆసక్తికర సంగతులు చెప్పింది. “సినిమాల్లోకి వస్తున్నప్పుడు నేను నటించగలను అనే విషయాన్ని మా కుటుంబం నమ్మలేకపోయింది. నేను సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. చిత్ర పరిశ్రమలో నా తల్లిదండ్రులకు మంచి పేరు ఉంది. కాబట్టి నేను నా నటనతో ప్రేక్షకుల్ని మెప్పించకపోతే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నన్ను తెరపై నటిగా చూసిన తర్వాత మా నాన్న కాస్త కుదుటపడ్డారు.” అని వివరించింది. ఇంకా ఆమె మాట్లాడుతూ “హీరోయిన్ అవకాశం రాకముందు వరకు కెమెరా వెనుక చేసే పనులైతే నాకు సరిపోతాయని అనుకున్నా. ఎందుకంటే నేను చాలా సున్నిత మనస్కురాల్ని. అంతేకాదు.. మా నాన్న, సాబూ సిరిల్ (ప్రొడక్షన్‌ డిజైనర్‌) మంచి స్నేహితులు.. ఒకే కుటుంబంలా ఉంటాం. ఆయన్ను చూస్తూ పెరిగా. అప్పుడు నాకు ఆఫ్‌ స్క్రీన్‌ అయితే సరిపోతుందని అనుకునేదాన్ని. అయితే హలో మూవీ విజయంతో పాటు నాలో నమ్మకాన్ని పెంచింది. ఇప్పుడు నా కొత్త సినిమాల విషయంలో చాలా నమ్మకంగా ఉన్నా.” ” అని కళ్యాణి చెప్పింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus