Kamal Haasan, Gautami: సంచలన నిర్ణయం తీసుకోబోతున్న కమల్ హాసన్..!

  • June 16, 2021 / 07:06 PM IST

‘ఇండియన్2’ మూవీ తాత్కాలికంగా ఆగిపోయినప్పటికీ.. కమల్ హాసన్ మాత్రం రెట్టింపు జోష్ తో సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం లోకేష్ కానగరాజన్ దర్శకత్వంలో ‘విక్రమ్’ అనే యాక్షన్ అండ్ థ్రిల్లింగ్ మూవీలో నటిస్తున్న కమల్ హాసన్ ఆ వెంటనే ‘దృశ్యం’ సీక్వెల్ అయిన ‘పాపనాశం-2’ ని కూడా పట్టా లెక్కించాలని భావిస్తున్నారు.ఒరిజినల్ ను తెరకెక్కించిన దర్శకుడు జీతూ జోసెఫ్.. ఈ సీక్వెల్ ను కూడా తెరకెక్కించనున్నారు.

ఆల్రెడీ ఈ సీక్వెల్ మలయాళంలో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. అయితే ఈ సీక్వెల్ అక్కడ ఓటిటి లో రిలీజ్ అయ్యింది.అయినప్పటికీ స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది కాబట్టి… ఒక్కసారి షూటింగ్ మొదలుపెడితే రెండే రెండు షెడ్యూల్స్ లో ఈ చిత్రం పూర్తయిపోతుంది.కాకపోతే ఒకటే సమస్య.! ‘పాపనాశం’ లో గౌతమి హీరోయిన్ గా నటించారు. కానీ ఆమె సీక్వెల్ లో నటించే అవకాశం లేదు. ఎందుకంటే మధ్యలో కమల్ కు గౌతమి ల మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి.

అంతేకాకుండా ‘కమల్ నన్ను నమ్మించి మోసం చేశారు.. నా బాధను పంచుకోవడానికి నాకు పిల్లలను కూడా లేకుండా చేశారు’ అంటూ ఆమె మొన్నామధ్య సంచలన కామెంట్లు చేసింది. ఈ నేపథ్యంలో గౌతమి ‘పాపనాశం 2’ లో ఆమె నటించే అవకాశాలు లేవని స్పష్టమవుతుంది. దీంతో ఈ సీక్వెల్ లో హీరోయిన్ గా మీనా ని ఎంపిక చేసుకోవాలి అని కమల్ భావిస్తున్నారట.అయితే దీనిపై స్పష్టత రావాల్సి ఉంది.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus