కంగనా రనౌత్ నిజంగా ముఖ్యమంత్రి అయిపోయినా ఆశ్చర్యం లేదట..!

  • September 16, 2020 / 08:49 PM IST

తనకు సంబంధం లేకపోయినా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో దూరి బాలీవుడ్ స్టార్ల పై ఇష్టమొచ్చిన కామెంట్లు చేస్తూ వచ్చింది స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్. బాలీవుడ్ స్టార్లందరూ డ్రగ్స్ బానిసలని కూడా ఆరోపణలు చేసింది కంగనా. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ఇటీవల కంగనా ‘ముంబై పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్‌లా మారిందంటూ ‘చేసిన కామెంట్స్ పెద్ద దుమారాన్నే రేపాయి.ఈ క్రమంలో శివ‌సేన ఎంపీ సంజ‌య్ రౌత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు.

అతనితో పాటు మ‌రో ఎమ్మెల్యే కూడా కంగన పై మండిపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ‘కంగనా.. ముంబైలో ఎలా అడుగుపెడుతుందో చూస్తాము’ అంటూ వారు హెచ్చరికలు కూడా జారీచేశారు. దానికి కంగనా ఇంకా రెచ్చిపోయి.. ‘నేను ముంబైలో అడుగుపెడతాను.. ఏం చేస్తారో చూస్తాను’ అంటూ సవాలు విసిరింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 9న కంగనా ముంబైలో అడుగుపెట్టగా ఆమెకోసం భారీగా సెక్యూరిటీ సిబ్బందిని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

అందుతున్న సమాచారం ప్రకారం.. కంగ‌న సెక్యూరిటీ టీంకు ఒక్కో నెలకు 10 ల‌క్ష‌ల‌ ఖర్చవుతుందట. దీనిని మొత్తం కేంద్ర‌ ప్రభుత్వమే భరిస్తుందట. శివ‌సేన‌ పై కంగ‌న రెచ్చిపోతుండడంతో బీజేపీ ప్రభుత్వం ఈమెను చేరదీస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఇష్యూని అడ్వాంటేజ్ గా తీసుకుంటుందని కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. చూస్తుంటే నిజంగానే కంగనా.. వర్మ చెప్పినట్టు భవిష్యత్తులో సి.ఎం అయిపొతుందేమో అంటూ కొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus