Kangana Ranaut: ”ఈ సినిమాను నాకంటే గొప్పగా ఎవరూ డైరెక్ట్ చేయలేరు”

Ad not loaded.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరోసారి దర్శకురాలిగా పని చేయనుంది. గతంలో ‘మణికర్ణిక’ సినిమాతో డైరెక్టర్ గా మారింది కంగనా.. ఇప్పుడు తన దర్శకత్వంలో మరో సినిమా చేస్తుంది. భారత మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ కథ ఆధారముగా ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. దర్శకత్వంతో పాటు ఇందిరా గాంధీ పాత్రను కంగనా పోషించనున్నట్లు తెలుస్తోంది. ‘ఎమర్జన్సీ’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమా నిర్మాణ పనులు ఇప్పటికే మొదలయ్యాయి.

ఈ సినిమాను తనకంటే గొప్పగా మరెవరూ డైరెక్ట్ చేయలేరని ధీమా వ్యక్తం చేసింది కంగనా. దర్శకురాలిగా మళ్లీ టోపీ ధరించడం ఎంతో ఆనందంగా ఉందని.. ఈ సినిమా కోసం ఏడాదిగా పని చేస్తున్నానని చెప్పింది. ఈ సినిమాను తనకంటే ఎవరూ బాగా డైరెక్ట్ చేయలేరని భావిస్తున్నట్లు చెప్పింది. రచయిత రితేష్ షా కథ అందిస్తున్నారని.. ఈ సినిమా తీసే క్రమంలో నటిగా కొన్నింటిని త్యాగం చేయాల్సి వస్తుందని చెప్పింది.

అయినా అవన్నీ పట్టించుకోనని.. ఇదొక అద్భుతమైన ప్రయాణం కానుందని తెలిపింది. ప్రస్తుతం కంగనా నటించిన ‘తలైవి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలానే ఆమె చేతుల్లో మరో రెండు సినిమాలు ఉన్నాయి.

Most Recommended Video

బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus