Karthi: ఖైదీ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కార్తీ.!

  • September 24, 2024 / 01:28 PM IST

కార్తీ (Karthi) , దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj)  కాంబినేషన్లో ‘ఖైదీ’  (Kaithi) సినిమా వచ్చింది. 2019 దీపావళికి పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తీ ఈ చిత్రంతో వంద కోట్ల(గ్రాస్) క్లబ్లో చేరాడు. పోటీగా విజయ్ నటించిన ‘బిగిల్’ సినిమా ఉన్నప్పటికీ.. ‘ఖైదీ’ వంద కోట్ల క్లబ్లో చేరడం అంటే మామూలు విషయం కాదు. ఆ సినిమాలో చాలా సీన్లు ఇప్పటికీ ప్రేక్షకుల మైండ్లో మెదులుతూనే ఉన్నాయి.

Karthi

ఇంకా చెప్పాలంటే ‘ఖైదీ’ కి కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇక ‘ఖైదీ’ చివర్లో సీక్వెల్ కి లీడ్ ఇచ్చి వదిలాడు దర్శకుడు లోకేష్. ‘విక్రమ్’ చిత్రంలో కూడా ‘ఖైదీ’ కి లింక్ పెట్టి వదిలాడు. అప్పటి నుండి ‘ఖైదీ 2’ సీక్వెల్ పై ఆసక్తి ఇంకా పెరిగింది. అయితే ‘ఖైదీ’ తర్వాత లోకేష్ బిగ్ లీక్లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో ‘ఖైదీ 2’ ని అతను పక్కన పెట్టాడు అని అంతా భావిస్తున్నారు.

అయితే ఈ విషయాలపై కార్తీ క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చిన కార్తీ.. తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ క్రమంలో ‘ఖైదీ 2’ ప్రస్తావన వచ్చింది. ‘2025 లో ‘ఖైదీ 2’ ప్రాజెక్టు కచ్చితంగా స్టార్ట్ అవుతుంది. ‘విక్రమ్’ (Vikram) సీక్వెల్లో భాగంగా కాదు.. ఢిల్లీ కథనే మీరంతా చూస్తారు.

‘ఖైదీ 2′ అందరి అంచనాలు మ్యాచ్ చేసే విధంగా ఉంటుంది’ అంటూ క్లారిటీ ఇచ్చాడు కార్తీ. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్.. రజినీకాంత్ తో  (Rajinikanth) ‘కూలీ’ (Coolie)  అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇది పూర్తయ్యాక ‘ఖైదీ 2’ ని లోకేష్ ప్రారంభించే అవకాశం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus