‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) నుండి 3 ఏళ్ళ వరకు సినిమా రావడం కష్టం అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ప్రస్తుతం అతను రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు కాబట్టి..! అందుకే మహేష్ పాత సినిమాలను రీ- రిలీజ్ చేసి క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి కొన్ని థర్డ్ పార్టీ సంస్థలు. మహేష్ బాబు ప్రతి పుట్టినరోజుకి.. అతని టీం ఓ సినిమాని రీ- రిలీజ్ చేస్తూ ఉంటుంది.
దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ కొరకు ఉపయోగిస్తుంటుంది. రీ- రిలీజ్..ల ట్రెండ్ మొదలైంది ‘పోకిరి’ తో (Pokiri) అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తర్వాత ‘బిజినెస్ మెన్’ (Businessman) ‘ఒక్కడు’ (Okkadu) ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (Seethamma Vakitlo Sirimalle Chettu) ‘మురారి’ (Murari) వంటి సినిమాలు రీ- రిలీజ్ అయ్యాయి. అన్నీ మంచి వసూళ్లు సాధించాయి. తెలుగు సినిమాల రీ- రిలీజ్ లలో ‘మురారి’ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
అయితే సౌత్ లో ‘గిల్లి’ ఏకంగా రూ.32 కోట్లు వసూల్ చేసి నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. మరో 2 రోజుల్లో ‘ఖలేజా’ (Khaleja) కూడా రీ- రిలీజ్ అవుతుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్నాయి. మొదటిసారి ఓ రీ రిలీజ్ సినిమాకి ప్రీమియర్లు కూడా వేస్తున్నారు. సో అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే ఈ సినిమా రూ.3 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది.
వీకెండ్ ముగిసేసరికి కచ్చితంగా రూ.12 కోట్లు పైనే కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ‘గిల్లి’ (Ghilli) కలెక్షన్స్ ను అధిగమించి సౌత్ లో నెంబర్ 1 ప్లేస్ లో నిలవాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు. మరోపక్క ఆగస్టు 9న ‘అతడు’ (Athadu) కూడా 4K లో రీ- రిలీజ్ కానుంది. ఇది మిస్ అయితే దానితో అయినా ‘గిల్లి’ రికార్డు బ్రేక్ అవ్వాలని మహేష్ అభిమానులు భావిస్తున్నారు.