మహేష్ 24 మూవీలో హీరోయిన్ గా కైరా ఖరారు

  • April 18, 2017 / 12:08 PM IST

మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న స్పైడర్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే కొరటాల శివతో సినిమాని మొదలెట్టనున్నారు. అందుకే డైరక్టర్ పక్కాగా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తిచేస్తున్నారు. మే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకి   “భరత్ అను నేను” అని పేరుని కూడా ఫిక్స్ చేసేసారు.  లండన్ నుంచి ఇండియాకి వచ్చిన ఎన్నారై పాత్రలో ప్రిన్స్ కనిపించనున్నారు. ఇందులో కొత్త హీరోయిన్ ని టాలీవుడ్ కి పరిచయం చేయాలనీ కొరటాల శివ ప్రయత్నించారు. ధోనీ బయో పిక్ ‘ఎం ఎస్ ధోని’ సినిమాలో నటించిన కైరా అద్వానీని హీరోయిన్ గా తీసుకునేందుకు సంప్రదింపులు జరిపారు.

మహేష్ బాబు గురించి తెలుసుకున్నకైరా అద్వానీ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన్నట్లు చిత్ర బృందం నేడు స్పష్టం చేసింది. కొరటాల, మహేష్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా శ్రీమంతుడుకి అద్భుతమైన పాటలను అందించిన రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్, ఈ మహేష్ 24 మూవీకి కూడా మంచి స్వరాలను ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus