Naga Chaitanya: కిషోర్‌ తిరుమల మరో సినిమా ఓకే చేసుకున్నారా?

  • July 3, 2021 / 03:23 PM IST

కిషోర్‌ తిరుమల ప్రస్తుతం ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’ అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. అయితే నిజానికి ఆ సినిమా వెంకటేశ్‌ హీరోగా తెరకెక్కాల్సింది. ఏమైందో కానీ… ఆ సినిమా శర్వానంద్‌ దగ్గరకు వచ్చేసింది. అయితే వెంకటేశ్‌తో ఛాన్స్‌ మిస్‌ అయినా… అల్లుడు నాగచైతన్యతో ఓ సినిమా ఉంటుందని చాలా రోజుల నుండి వార్తలొస్తున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కథతో రాబోతున్నారని వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా ఇప్పుడు ఓకే అయ్యిందని టాక్‌.

ఫుల్‌ లెంగ్త్‌ ఫ్యామిలి అండ్‌ ఎంటర్‌టైన్మెంట్‌ కథను ఇటీవల నాగచైతన్యకు కిషోర్‌ తిరుమల వినిపించారట. కథ బాగా నచ్చడంతో సినిమాకు చైతు పచ్చ జెండా ఊపేశాడట. నాగచైతన్య నుండి ఇలాంటి సినిమాలు ఇటీవల కాలంలో రాలేదు. వచ్చినా కమర్షియల్‌ హంగులకు దూరంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా పూర్తి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తో తీర్చిదిద్దుతారని టాక్‌. అన్నట్లు ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత. ప్రస్తుతం నాగచైతన్య ‘థ్యాంక్‌ యూ’ సినిమా చిత్రీకరణలో ఉన్నాడు.

త్వరలో సినిమా కొత్త షెడ్యూల్‌ మొదలవుతుంది. మరోవైపు బాలీవుడ్‌ సినిమా ‘లాల్‌ సింగ్‌ చద్దా’లో నాగచైతన్య నటిస్తున్నారు. వీలైనంత త్వరగా ఆ సినిమాలు పూర్తి చేసి ‘బంగార్రాజు’ సినిమాల పనులు మొదలుపెడతాడట. ఈ లోగా కిషోర్‌ తిరుమల ‘ఆడాళ్లూ మీకు జోహార్లూ’ సినిమా పూర్తి చేసి… చైతు సినిమా కోసం రెడీ అవుతాడట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus