నివేత థామస్ కొత్త చిత్రం ఇదే.!

  • April 14, 2018 / 10:05 AM IST

నేచురల్ స్టార్ నాని “జెంటిల్‌మేన్” సినిమాతో నివేతా థామస్ తెలుగు వారికి పరిచయమంది. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. దాని తర్వాత కూడా నానితో నిన్నుకోరి మూవీ చేసి హిట్ అందుకుంది. హిట్ పెయిర్ గా పేరుతెచ్చుకుంది. తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో జై లవకుశ సినిమాలో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఈ చిత్రం విజయం తర్వాత ఆమెకు అనేక అవకాశాలు వచ్చినా చేయలేదు. అందుకు డిగ్రీ ఆఖరి సెమిస్టర్‌ పరీక్షలే కారణమని నివేత రీసెంట్ గా వెల్లడించింది. పరీక్షలు పూర్తి కావడంతో ఓ చిత్రానికి సైన్ చేసింది. కళ్యాణ్ రామ్ సరసన నటించడానికి ఒకే చెప్పింది.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ “నా నువ్వే” సినిమా చేస్తున్నారు. మిల్కీ బ్యూటీ తమన్నా చేస్తున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత ప్రముఖ సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో నటించడానికి కళ్యాణ్ రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో ఇతర ఆర్టిస్టులను ఎంపిక చేస్తున్నారు. హీరోయిన్స్ గా నివేదా థామస్, షాలినీ పాండేను సెలక్ట్ చేశారు. వరుసగా విజయాలు అందుకున్న నివేదా, ఒక్క సినిమాతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న షాలిని .. ఇద్దరూ ఇందులో నటిస్తుండడంతో ఈ సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus