టాలీవుడ్ హీరోల పై లావణ్య త్రిపాఠి కామెంట్స్..!

  • May 21, 2020 / 09:41 AM IST

‘అందాల రాక్షసి’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి అతి తక్కువ టైంలోనే క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. పెద్ద హీరోలతో సినిమాలు చెయ్యకపోయినా మీడియం రేంజ్ హీరోల సినిమాల్లోనే గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలను చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ‘భలే భలే మగాడివోయ్’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘శ్రీరస్తు శుభమస్తు’ ‘అర్జున్ సురవరం’ వంటి హిట్లు అందుకుంది. మితి మీరిన గ్లామర్ షో ఈ బ్యూటీ చెయ్యదు. ఎటువంటి అసభ్యకరమైన సన్నివేశాల్లోనూ నటించడానికి ఒప్పుకోదు. పేద సినీ కళాకారుల కోసం ఏర్పాటు చేసిన సి.సి.సి కి వెంటనే స్పందించి విరాళం అందించింది ఈ బ్యూటీ.

ఇదిలా ఉండగా తాజాగా ఈ బ్యూటీ ఆన్లైన్ లైవ్ కండక్ట్ చేసి టాలీవుడ్ హీరోల గురించి నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి ఆసక్తికరమైన వన్ లైన్ కామెంట్స్ చేసింది. ముందుగా ప్రభాస్ … చాలా కూలెస్ట్ గా ఉంటాడని చెప్పిన లావణ్య… రాంచరణ్ అంటే ఓ అద్భుతమని చెప్పింది. అతను నటించిన ‘రంగస్థలం’ చిత్రం తనకి చాలా ఇష్టమని వెల్లడించింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ ను అయితే ఎవరూ మ్యాచ్ చేయలేరని.. ‘ఆర్ఆర్ఆర్’ లో తన లుక్ కోసం వెయిట్ చేస్తున్నాను అని చెప్పింది.

అల్లు అర్జున్ గురించి అడగ్గానే ‘పుష్ప’ ఫస్ట్ లుక్ చింపేసిందని, మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటూ చెప్పింది. పవన్ కళ్యాణ్… ప్రతీ విషయం పైనా స్పందిస్తాడని, ఆయన ధైర్యం పై ఆమెకి ఎంతో గౌరవం ఉందని చెప్పింది. ఇక మెగాస్టార్ చిరంజీవి నిజమైన హీరో అని… ఆమె ఆరాధించే నటుల్లో ఆయన కూడా ఒకరని చెప్పింది.అంతే కాదు చిరంజీవి చాలా మంచి వ్యక్తని, ఆయనలోని దయాగుణం, వినయం ఎంతో ఇన్స్పైరింగ్ అని తెలిపింది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus