వరుస అవకాశాలు దక్కించుకుంటున్న అందాల రాక్షసి

మొదటి చిత్రం తోనే ప్రేక్షకుల మనసులు దోచేసింది హీరోయిన్ లావణ్య త్రిపాఠీ. ‘అందాల రాక్షసి’గా తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైన లావణ్య, అప్పుడెప్పుడో మణిరత్నం గీతాంజలి సినిమాలో నటించిన గిరిజను తలపించింది. ఈమె టాలీవుడ్ ని ఏలేయడం ఖాయం అనుకున్నారంతా. ఐతే నటన పరంగా ఎంత టాలెంటెడ్ ఉన్నా ఎక్సపోసింగ్ కి దూరంగా ఉండే లావణ్య స్టార్ హీరోలు నటించే, కమర్షియల్ సినిమాలకు పనికి రాదన్నట్లుగా ఎవరూ ఆమెకు పెద్ద సినిమా ఆఫర్స్ ఇవ్వలేదు. ఐతే ఆమె ఖాతాలో హిట్స్ సంఖ్య తక్కువగా ఉండటం కూడా ఒక కారణం. డజనుకు పైగా చిత్రాలలో ఆమె నటించగా వాటిలో మూడో, నాలుగో మంచి విజయాలు సాధించాయి.

ఇక కెరీర్ ఔట్ అనుకున్న సమయంలో ఎప్పటి నుండో బాక్సులలో విడుదలకు నోచుకోకుండా నలిగిపోతున్న నిఖిల్ అర్జున్ సురవరం గత ఏడాది చివర్లో విడుదలై ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. ఐతే లావణ్యకు టాలీవుడ్ లో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, నేడు కార్తికేయ హీరోగా ప్రారంభమైన కొత్త చిత్రం ‘చావు కబురు చల్లగా’లో లావణ్య హీరోయిన్ గా ఎంపికైంది. కెరీర్ ముగిసిపోయింది అనుకున్న టైమ్ లో వరుస అవకాశాలు అందుకుంటుంది ఈ అమ్మడు. ఇక ఈ రెండు చిత్రాలలో ఏది విజయం సాధించినా ఆమె కెరీర్ మళ్ళీ ఊపందుకోవడం ఖాయం.

Most Recommended Video

పవన్ కళ్యాణ్ రీమేక్ చేసిన 11 సినిమాల
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus