మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మహేంద్ర బాహుబలి.!

  • March 23, 2018 / 12:28 PM IST

మైనపు ప్రతిమలకు ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ వారి ప్రధాన మ్యూజియం లండన్ లో ఉంది. ఇందులో ప్రఖ్యాతగాంచిన ప్రముఖుల మైనపు ప్రతిమలను ప్రతిష్టిస్తుంటారు. మేడమ్ టుస్సాడ్స్  బ్యాంకాక్ మ్యూజియంలోను పాపులర్ పర్సన్స్  మైనపు బొమ్మలను ఏర్పాటుచేస్తుంటారు. ఆ మ్యూజియంలో తొలిసారి తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రభాస్ స్థానం సంపాదించుకున్న విషయం అందరికీ తెలిసిందే. బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి మైనపు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటుచేశారు.

బాహుబలి సినిమాలో కీలకమైన కట్టప్ప పాత్రకు కూడా ఈ మ్యూజియంలో చోటు దక్కింది. త్వరలో సత్యరాజ్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ వారి ప్రధాన మ్యూజియం (లండన్) లో ప్రతిష్టించనున్నారు. తమిళ నటుల్లో ఈ గౌరవం అందుకున్న నటుడు సత్యరాజ్ కావడం విశేషం. ఇక అదే మ్యూజియంలో బాహుబలి లోని మహేంద్ర బాహుబలి విగ్రహాన్ని ప్రతిష్టించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని సత్యరాజ్‌ కుమారుడు సిబిరాజ్‌ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఈ వార్త అటు బాహుబలి చిత్ర బృందానికి, ఇటు ప్రభాస్ అభిమానులకు సంతోషాన్ని కలిగించింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus