Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

కోలీవుడ్ హీరో విశాల్‌కు (Vishal) మద్రాస్ హైకోర్టు ఊహించని షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు విశాల్ ఏకంగా రూ.30.05 కోట్లను చెల్లించాలని, దానికి అదనంగా, ఆ మొత్తంపై ఏటా 30% చొప్పున వడ్డీని కూడా చెల్లించాల్సిందేనని కోర్టు తేల్చి చెప్పింది. చాలాకాలంగా వీరిద్దరి మధ్య నడుస్తున్న ఓ ఆర్థిక వివాదంలో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.ఈ వివాదం 2021లో మొదలైంది. లైకా ప్రొడక్షన్స్ వారు కోర్టులో ఓ పిటిషన్ వేశారు.

Vishal

దాని ప్రకారం, విశాల్ తమకు రూ.21.20 కోట్లు బాకీ ఉన్నారని ఆరోపించారు. ఫిల్మ్ ఫైనాన్షియర్ అన్బుచెళియన్ దగ్గర విశాల్ తరఫున లైకా సంస్థ రూ.15 కోట్ల అప్పు తీసుకుంది. ఆ తర్వాత ఆ అప్పును లైకానే టేకోవర్ చేసింది. అయితే, ఎన్నిసార్లు అడిగినా, గుర్తు చేసినా విశాల్ ఆ డబ్బును తిరిగి చెల్లించలేదని లైకా తమ పిటిషన్‌లో పేర్కొంది.

దీంతో ‘లైకా ప్రొడక్షన్స్’ కోర్టును ఆశ్రయించింది. తాము చెల్లించాల్సిన అసలు మొత్తం, దానికి అంగీకరించిన వడ్డీతో కలిపి మొత్తం రూ.30.05 కోట్లు ఇప్పించాలని డిమాండ్ చేసింది. వాదనలు విన్న న్యాయస్థానం, ‘లైకా ప్రొడక్షన్స్’ వైపే మొగ్గు చూపింది. విశాల్ ఆ పూర్తి మొత్తాన్ని, బాకీ తీరేంత వరకు సంవత్సరానికి 30% వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇదిలా ఉంటే, ఈ కేసుకు సంబంధించి విశాల్ ఇంతకుముందే రూ.2.6 కోట్లను కోర్టులో డిపాజిట్ చేశారు. ఇప్పుడు చెల్లించాల్సిన మొత్తంలోంచి ఈ రూ.2.6 కోట్లను సర్దుబాటు చేస్తామని కోర్టు స్పష్టంచేసింది. ఏదేమైనా, ఈ తీర్పు విశాల్‌ కు ఆర్థికంగానే కాకుండా, వృత్తిపరంగా కూడా పెద్ద దెబ్బేనని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus