పబ్లిసిటీ జోరు పెంచనున్న మహేష్, అల్లు అర్జున్.!

  • April 14, 2018 / 10:08 AM IST

సినిమాని అందంగా మలచడమే కాదు.. ఆ సినిమాని చూడాలనే ఆత్రుతని కూడా అభిమానుల్లో కల్పించాలి. థియేటర్ కి రప్పించాలి. అప్పుడే ఆ చిత్ర బృందం విజయవంతమయినట్టు. అందుకే ప్రచార కార్యక్రమాల వేగాన్ని పెంచడానికి మహేష్, అల్లు అర్జున్ సినిమా యూనిట్ సభ్యులు సిద్ధమయ్యారు. శ్రీమంతుడు వంటి ఇండస్ట్రీ హిట్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీ భరత్ అనే నేను. ఈ సినిమాపై భారీ క్రేజ్ ఉంది. అలాగని సైలంట్ గా ఉండడం లేదు. మహేష్ ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రానికి మొదటి నుంచి వినూత్నంగా పబ్లిసిటీ చేస్తున్నారు.

ఫస్ట్ ఓత్, భరత్ విజన్, భరత్ జర్నీ, బహిరంగ సభ అంటూ రాజకీయ భాషలో సినీ వేడుకలను నిర్వహించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న నా పేరు సూర్య టీమ్ కూడా ఏమి తక్కువ తినలేదు. ఫస్ట్ ఇంపాక్ట్, డైలాగ్ ఇంపాక్ట్ అంటూ కొత్తగా వీడియోలను రిలీజ్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడనుండడంతో ప్రచార వేగాన్ని పెంచారు. ఇప్పటికే పాటలను రిలీజ్ చేసిన మహేష్ టీమ్.. ఆ పాటలకు సంబంధించిన ప్రోమోలను రెండు రోజులకు ఒకటి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు. “నా పేరు సూర్య” టీమ్ కూడా పాటలన్నీ  వరుసగా విడుదల చేస్తున్నారు.  ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న, “నా పేరు సూర్య” మే 4న థియేటర్లోకి రానున్నాయి. అయినా ఒకరికొకరు ఏ మాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus