Mahesh Babu: సర్కారులో ఆ ట్రాక్ హైలెట్ అంటున్న మహేష్!

  • May 9, 2022 / 10:50 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు. సర్కారు వారి పాట ఫస్టాఫ్ లో అద్భుతమైన ట్రాక్ ఉందని 45 నిమిషాల పాటు థియేటర్ ఊగిపోయే విధంగా ఆ ట్రాక్ ఉంటుందని మహేష్ బాబు తెలిపారు. డైరెక్టర్ పరశురామ్ ఆ ట్రాక్ ను అద్భుతంగా డిజైన్ చేశారని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. ఈ ఎపిసోడ్ ను తాను బాగా ఎంజాయ్ చేశానని మహేష్ బాబు వెల్లడించారు.

ఆ ఎపిసోడ్ లో తన టైమింగ్ కుదిరిందని ఆడియన్స్ ఊగిపోవడం గ్యారంటీ అని మహేష్ బాబు పేర్కొన్నారు. ఫ్యాన్స్ కూడా ఊగిపోవడం గ్యారంటీ అని మహేష్ బాబు పేర్కొన్నారు. గడిచిన ఏడెనిమిది సంవత్సరాలలో ఇలాంటి సన్నివేశాలు చేయలేదని ట్రైలర్ క్లిక్ కావడానికి ఆ 45 నిమిషాలే కారణమని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. తన మాటల ద్వారా సర్కారు వారి పాట సినిమాపై మహేష్ అంచనాలను పెంచేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్కే బీచ్ సెట్ వేసి షూట్ చేశామని వైజాగ్ లో షూట్ చేస్తే జనాలు వచ్చి మీద పడిపోతారని మహేష్ తెలిపారు.

సినిమాలో సహజంగా ఉండేలా గ్రాఫిక్స్ పెట్టామని ఆ క్రెడిట్ ను గ్రాఫిక్స్ టీమ్ కు ఇవ్వాలని ఆయన అన్నారు. సర్కారు వారి పాటలో ఆ ఎపిసోడ్ ను చూస్తే గ్రాఫిక్స్ అని సెట్ అని ఎవరూ అనుకోరని ఆయన కామెంట్లు చేశారు. బర్గర్ లు, పెరుగన్నం, పేస్ట్రీలు అస్సలు తిననని ఆయన కామెంట్లు చేశారు.గడిచిన పదేళ్లుగా తాను వాటికి దూరంగా ఉంటానని ఆయన చెప్పుకొచ్చారు. హాలిడే ట్రిప్స్ లో మాత్రం వాటిని తింటానని ఆయన కామెంట్లు చేశారు.

మహేష్ బాబు చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. సర్కారు వారి పాట సక్సెస్ సాధించి మహేష్ కోరుకున్న హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పరిమిత బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం అందుతోంది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus