ముందుగా వచ్చిన మహేష్ ని మరచి బన్నీ సినిమాను పొగిడిన ఎన్టీఆర్…!

  • January 13, 2020 / 12:42 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా నిన్న అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. బన్నీ అద్భుతంగా నటించాడు…త్రివిక్రమ్ చిత్రాన్ని ఉన్నతంగా మలిచాడు, ఓ గొప్ప మూవీ చూసిన భావన కలిగిందన్నారు.బెస్ట్ విశెష్ బావా…అని ఆప్యాయంగా బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు.అలాగే సినిమాలో కీలక పాత్ర చేసిన మురళి శర్మతో పాటు సాంకేతిక నిపుణులపై కూడా తారక్ ప్రసంశల వర్షం కురిపించారు.ఐతే గత కొంత కాలంగా మహేష్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న తారక్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగించింది.అల వైకుంఠపురంలో మూవీ కంటే మహేష్ మూవీ ఒక రోజు ముందే విడుదల అయ్యింది. అయినప్పటికీ తారక్ ఆ చిత్రం గురించి ఏ విధంగానూ స్పందించలేదు.

తారక్ మహేష్ సినిమా ఇంకా చూడలేదా? ..ఒక వేళ చూసినా స్పందించలేదా? అనే అనుమానాలు మహేష్ ఫ్యాన్స్ లో కలుగుతున్నాయి.విడుదలైన రెండు చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో కేవలం బన్నీ సినిమానే పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావడం లేదు.తన తాత గారైన ఎన్టీఆర్ బయోపిక్, బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తే ఆ చిత్రం గురించి కనీసం నోరు మెదపలేదు ఎన్టీఆర్. అలాంటిది బన్నీ చిత్రాన్ని ఓ స్థాయిలో పొగిడాడు అంటే ఆలోచించాల్సిన విషయమే. ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మూవీ చేయనున్నట్లు తెలుస్తుంది.మరి ఆ కారణం రీత్యా ఎన్టీఆర్ అల వైకుంఠపురంలో మూవీ గురించి ఇలా స్పందించి ఉంటాడు.కానీ ఈ పరిణామం మహేష్ అభిమానుల కు ఎన్టీఆర్ పై కోపానికి కారణమైంది. ఐతే ఎన్టీఆర్ ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాడన్న విషయం మర్చిపోకూడదు.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus