Mahesh Babu: మరో కూల్ డ్రింక్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు..!

  • December 3, 2021 / 10:57 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ప్రిన్స్ అని మాత్రమే కాదు.. మరికొంత మంది ‘బ్రాండ్ బాబు’ అని కూడా అంటుంటారు. ఎందుకంటే టాలీవుడ్లో అతను ప్రమోట్ కమర్షియల్ బ్రాండ్స్ .. మరే హీరో కూడా ప్రమోట్ చేయడం లేదు. థంప్స్‌అప్‌, అభి బస్‌, ఐడియా, సంతూర్‌, ప్యారగాన్,అమృతాంజన్ అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. ఇదిలా ఉండగా… దశాబ్దం పై నుండీ మహేష్ బాబు థమ్సప్ బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ ఏడాదితో కోకాకోలా సంస్థతో అగ్రిమెంట్ పూర్తయినట్టు ఉంది.. ఇప్పుడు మరో కూల్ డ్రింక్ బ్రాండ్ కు మహేష్ బాబు షిఫ్ట్ అయ్యాడు. అవును మహేష్ బాబు త్వరలో ‘మౌంటెయిన్ డ్యూ’ బ్రాండ్ కు ప్రచార కర్తగా వ్యవహరించేందుకు రెడీ అవుతున్నాడు. ‘లెట్స్ డ్యూ ఇట్’ అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు మహేష్ బాబు. అందుకు సంబంధించిన ఓ ఫోటోని కూడా పోస్ట్ చేసాడు. అది ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక ‘మౌంటెయిన్ డ్యూ’ కూల్ డ్రింక్ ను ఇప్పటివరకు అక్కినేని అఖిల్ ప్రమోట్ చేస్తూ వచ్చాడు.దాదాపు 6 ఏళ్ళ నుండీ అతను ప్రమోట్ చేసాడు.అఖిల్ తో చేసుకున్న అగ్రిమెంట్ పూర్తవ్వడంతో… ఇప్పుడు ఆ బ్రాండ్ మహేష్ బాబు వద్దకు వెళ్ళినట్టు తెలుస్తుంది. మరి మహేష్ టేకాఫ్ చేసాక… దీని సేల్స్ పెరుగుతాయేమో చూడాలి..!

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
ప్రిన్స్ టు రవి.. ‘బిగ్ బాస్’ లో జరిగిన 10 షాకింగ్ ఎలిమినేషన్స్..!
చిరు, కమల్ మాత్రమే కాదు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ప్లాపైన స్టార్స్ లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus