తన 25 వ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో చెప్పిన మహేష్.!

  • April 14, 2018 / 10:51 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో చేసిన భరత్ అనే నేను సినిమా ఈ నెల 20 న సినిమా రిలీజ్ కానుంది. దీని తర్వాత మహేష్… వంశీ పైడి పల్లి దర్శకత్వంలో నటించనున్నారు. ఈ మూవీకి  పోస్ట్ ప్రొడక్షన్ పక్కాగా జరుగుతోంది. అమెరికా నేపథ్యములో సాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఖరారు అయింది. అలాగే ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలిని పాండే ని కూడా సెలక్ట్ చేసినట్లు తెలిసింది. ఈమె మహేష్ ఫ్రెండ్ రోల్ చేస్తోన్న అల్లరి నరేష్ కి జోడీగా నటిస్తున్నట్లు తెలిసింది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం  డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. ఈ సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి  వెళ్తుందని అనుకున్నారు. అయితే మే నెలని మహేష్ పూర్తిగా కుటుంబ సబ్యులకు కేటాయించారు. భార్య, పిల్లల్తో విదేశాల్లో విహరించనున్నారు. జూన్ లోనే తన 25 వ సినిమా సెట్స్ పైకి వెళుతుందని మహేష్ మీడియాకి స్పష్టం చేశారు. ఈ చిత్రానికి కూడా  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus