Mahesh Babu, Ram Charan: ఆచార్య వెనుక ఇంత కథ ఉందా?

  • July 12, 2021 / 08:40 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో నూటికి నూరుశాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. టాలీవుడ్ స్టార్ హీరోలలో చాలామంది హీరోలు కొరటాల శివ దర్శకత్వంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. మొదట్లో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలిసి పని చేసిన కొరటాల శివ ఆచార్య సినిమాకు మాత్రం సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేసుకున్నారు. చిరంజీవి ప్రధాన పాత్రలో ఆచార్య సినిమా మొదలు కాగా చివరకు ఈ సినిమా మల్టీస్టారర్ గా మారింది.

మహేష్ బాబుతో శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాలను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్న కొరటాల శివ ఆచార్య మూవీలో మహేష్ తో గెస్ట్ రోల్ చేయించాలని భావించారు. అయితే ఆ విషయాన్ని చిరంజీవికి చెప్పగా చిరంజీవి మాత్రం ఆ పాత్రను చరణ్ తో చేయిస్తే బాగుంటుందని భావించారు. చరణ్ ఈ సినిమా కోసం ఫైనలైజ్ అయిన తర్వాత కొరటాల శివ చరణ్ పాత్ర పరిధిని పెంచారు.

సినిమాలో సెకండాఫ్ లో చరణ్ కనిపిస్తారని చరణ్ పాత్రను కొరటాల శివ ఆసక్తికరంగా క్రియేట్ చేశారని తెలుస్తోంది. చరణ్ ఈ సినిమాలో సిద్ధ పాత్రలో నటిస్తుండగా నీలాంబరి పాత్రలో పూజా హెగ్డే నటిస్తున్నారు. సినిమాలో చరణ్ పాత్ర చనిపోతుందని సిద్ధ పాత్ర లక్ష్యాలను చిరంజీవి సాధిస్తారని తెలుస్తోంది. ఈ సినిమాలో సోనూసూద్ విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొనగా ఈ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో చూడాల్సి ఉంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!</a

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus