అరవింద్ స్వామి విషయంలో మహేష్ బాబు సంచలన నిర్ణయం

  • December 21, 2016 / 01:21 PM IST

రోజా, ముంబయి చిత్రాల్లో హీరోగా నటించి అందరి మనసులు దోచుకున్న అరవింద్ స్వామి, తని వరువన్ మూవీతో విలన్ గా మారారు. ఆ చిత్రాన్ని ధృవ గా తెలుగులో రీమేక్ చేయడంతో అందులోను ఆయనే నటించారు. సూపర్ హిట్ సాధించిన ఈ మూవీలో హీరో రామ్ చరణ్ కంటే విలన్ అరవింద్ స్వామి కే మంచి మార్కులు పడ్డాయి. దీంతో టాలీవుడ్ కి చెందిన దాదాపు పదిహేనుమంది నిర్మాతలు ఆయన డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. అంత డిమాండ్ ఉన్న అరవింద్ స్వామికి తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు షాక్ ఇచ్చారు.

తన సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి వద్దని నిర్మాతకు ఆయన స్పష్టం చేశారు. అంతటి నటుడిని మహేష్ ఎందుకు వద్దన్నారని ఆరా తీస్తే ఆసక్తికర విషయం తెలిసింది. ధృవలో నటించడానికి అరవింద్ స్వామి మూడు కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత కూడా ఆయన మూడు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. దీంతో సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని అలోచించి అతన్ని పక్కన పెట్టమని నిర్మాతకు మహేష్ వివరించినట్లు సమాచారం. ఇప్పటికైనా అరవింద్ స్వామి తన రెమ్యునరేషన్ విషయంలో తగ్గితే మంచిదని టాలీవుడ్ నిర్మాతలు ఆశిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus