Sarkaru Vaari Paata: మహేష్ టార్గెట్ ను రీచ్ అవుతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు సర్కారు వారి పాట మూవీ షూటింగ్ వేగంగానే జరిగింది. అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల ఇతర హీరోల సినిమాలతో పాటు సర్కారు వారి పాట మూవీ షూటింగ్ కు సైతం బ్రేకులు పడ్డాయి. మహేష్ బాబు ఈ సినిమా కోసం నిద్ర లేని రాత్రులు గడపాల్సి వస్తోందని తెలుస్తోంది. నైట్ షూట్ లో పాల్గొంటూ ఈ మూవీ కోసం మహేష్ చాలా కష్టపడుతున్నారని సమాచారం.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా దాదాపు 50 శాతం షూటింగ్ పూర్తైందని సమాచారం. మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ ఈ సినిమాలో నటిస్తుండగా కీర్తి సురేష్ కూడా నైట్ షూట్ లో పాల్గొంటున్నారు. మహేష్ కు విలన్ గా సముద్రఖని ఈ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు తెలియల్సి ఉంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ కూడా లీక్ అయ్యి నెట్టింట తెగ వైరల్ అయింది.

మహేష్ బాబు ఈ సినిమాను కచ్చితంగా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.అయితే మహేష్ అనుకున్న విధంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతుందో లేదో తెలియాల్సి ఉంది. త్వరలో మహేష్ బాబు త్రివిక్రమ్ మూవీ షూటింగ్ లో కూడా పాల్గొననున్నారు. ఈ రెండు సినిమాలు విడుదలైన తర్వాత రాజమౌళి మూవీ షూటింగ్ లో మహేష్ బాబు పాల్గొననున్నారు.

Most Recommended Video

పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus