భరత్ అనే నేను నిర్మాతపై గుర్రుగా మహేష్ బాబు!

  • July 11, 2018 / 12:28 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి భరత్ అనే నేను సినిమా ఒత్తిడిని దూరం చేసింది. బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాలు విజయం సాధించడంతో చాలా ఇబ్బంది పడ్డారు. కొరటాల శివ మళ్లీ తనకు హిట్ ఇవ్వడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఈ విజయం అతనికి పూర్తి సంతృప్తి ఇవ్వలేదని తెలిసింది. అందుకు కారణం నిర్మాత డీవీవీ దానయ్య అని సమాచారం. భరత్ అనే నేను సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించి దానయ్య మహేష్ మనసును గెలుచుకున్నారు. కానీ ఇప్పుడు అతను రాజకీయాలు నచ్చక అసహ్యించుకుంటున్నారు. భరత్ అనే నేను మంచి లాభాలను తెచ్చి పెట్టింది. అయినా ఈ చిత్రం గురించి ఎక్కడా గొప్పగా చెప్పుకోవడం లేదంట.

దీనికంటే రామ్ చరణ్ తేజ్  రంగస్థలం గురించే గొప్పగా చెబుతున్నారంట. అదే మహేష్ బాబు కి నచ్చడం లేదని  ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. రంగస్థలం తో దాదాపు సమానంగా భరత్ అనే నేను అభినందనలు, కలక్షన్స్ అందుకుంది. అలా ప్రచారం చేయకుండా చెర్రీ సినిమాకి జై కొట్టడంపై మెగాస్టార్ ఫ్యామిలీకి దగ్గర కావాలని ఆలోచన ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు దానయ్య  రామ్ చరణ్ తో భారీ యాక్షన్ మూవీ చేస్తున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానుంది. ఆ తర్వాత కూడా మెగా హీరోలతోనే దానయ్య సినిమాలు నిర్మించాలని భావిస్తున్నట్లు ఈ సంఘటన స్పష్టం చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus