దర్శకనిర్మాతలకు చివాట్లు పెట్టిన మహేష్..!

  • May 30, 2020 / 02:38 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి డైరెక్షన్లో చెయ్యాలనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్(బుజ్జి) తో చేస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు గత కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. ఇక టైటిల్ తో సహా పూర్తి వివరాలను.. తన తండ్రి కృష్ణ పుట్టినరోజున అధికారికంగా ప్రకటించాలని అనుకున్నాడు. నిజానికి అదే రోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలుపెట్టాలి అనుకున్నా…

విజయనిర్మల గారు చనిపోయి ఇంకా ఏడాది కాలేదని.. ఆ బాధ నుండీ తన తండ్రి ఇంకా బయటకు రాలేదని భావించి.. ‘పూజా కార్యక్రమాలు వద్దు.. టైటిల్ మరియు పోస్టర్ ను విడుదల చెయ్యమని’ దర్శక నిర్మాతలకు చెప్పినట్టు తెలుస్తుంది. అయితే చిత్ర యూనిట్ సభ్యుల నుండీ అధికారిక ప్రకటన రాకముందే.. ‘మహేష్ 27’ టైటిల్ ‘సర్కారు వారి పాట’ అని లీకైపోయింది.మహేష్ బాబు సినిమా టైటిల్ కాబట్టి వెంటనే వైరల్ కూడా అయిపొయింది.

అయితే ఇలా టైటిల్ లీక్ అవ్వడం పై మహేష్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ‘సెంటిమెంట్ గా తన తండ్రి పుట్టినరోజున టైటిల్ ను ప్రకటించాలి అని ఆశపడితే ఇలా జరగడం ఏంటి?’ అంటూ దర్శక నిర్మాతల పై ఫైర్ అయ్యాడట. అంతేకాదు మహేష్ తన టీం పై కూడా ఫైర్ అయ్యాడని తెలుస్తుంది. ‘ఇలాంటి పొరపాటు మరొక్కసారి జరిగితే బాగోదు’ అని కూడా మహేష్ వారిని హెచ్చరించినట్టు సమాచారం.

Most Recommended Video

రన్ మూవీ రివ్యూ & రేటింగ్
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus