‘చిరు 152’ మళ్ళీ ఇంకా డైలమాలోనే ఉన్నారు..!

  • March 4, 2020 / 01:46 PM IST

మెగాస్టార్ – కొరటాల శివ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. దీనికి ‘ఆచార్య’ అనే టైటిల్ ను అనుకుంటున్నారు. మెగాస్టార్ అయితే ఈ టైటిల్ ను లీక్ చేశారు అంటున్నారు కానీ.. ఇంకా ఆ టైటిల్ ను ఫిక్స్ చెయ్యలేదు అనేది వినికిడి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో కీలక పాత్రలో మహేష్ నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మొదట చరణ్ ను ఈ పాత్రకు అనుకున్నారు.. కానీ ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ పూర్తవ్వకపోవడం.. దానికి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఎన్నో బ్యాలన్స్ ఉండడంతో కుదరక.. ఈ పాత్రని మహేష్ తో చేయించాలని డిసైడ్ అయ్యారు చిత్ర యూనిట్ సభ్యులు అంటూ వార్తలు వచ్చాయి. అయితే మహేష్ బాబు ని పెట్టుకోవడం వల్ల బడ్జెట్ మరో 40 కోట్లు ఎక్కువైపోతుందని చిరు .. చరణ్ తోనే ఈ పాత్ర చేయించాలి అని ఫిక్స్ అయినట్టు తాజాగా మరో వార్త వచ్చింది.

అలా ఫిక్సయితే.. ‘ఆచార్య’ ను 2021 మార్చి కి విడుదల చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగష్టు 14న విడుదల చేయాలని టీం డిసైడ్ అయ్యారు. ఈ కథ ప్రకారం ‘ఇండిపెండెన్స్ డే’ కి రిలీజ్ చేస్తేనే బాగుంటుందని ముందుగా డిస్కస్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలి అనుకుంటే.. వచ్చే ఏడాది వరకూ రిలీజ్ ను వాయిదా వేయాల్సిందే. ప్రస్తుతం కొరటాల – చిరు ఈ విషయంలో సందిగ్ధం లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Most Recommended Video
‘హిట్ ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యూనరేషన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus