Mahesh , Rajamouli: మహేష్ జక్కన్న మూవీలో మెసేజ్ ఉంటుందా?

  • May 29, 2022 / 12:54 PM IST

బాహుబలి1, బాహుబలి2, ఆర్ఆర్ఆర్ సినిమాలతో సంచలన విజయాలను సొంతం చేసుకున్న రాజమౌళి త్వరలో మహేష్ బాబు తో తీసే సినిమా కథను ఫైనల్ చేసి ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టనున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులకు ఎక్కువ సమయం కేటాయించడం ద్వారా ఈ సినిమా షూటింగ్ ను వేగంగా పూర్తి చేయాలని జక్కన్న భావిస్తున్నారని సమాచారం. అయితే మహేష్ తో రాజమౌళి అవతార్ తరహా సినిమా తీస్తారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

దాదాపుగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ మొత్తంలో 40 శాతం రెమ్యునరేషన్లకు ఖర్చు కానుందని తెలుస్తోంది. మహేష్ బాబు సాధారణంగా తీసుకునే రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఈ సినిమాకు కొంతమేర ఎక్కువ మొత్తమే రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. మహేష్ జక్కన్న మూవీలో మెసేజ్ కూడా ఉండనుందని ప్రచారం జరుగుతోంది. పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని దేశ విదేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరనుందని సమాచారం అందుతోంది.

మహేష్ కు విలన్ గా ప్రముఖ బాలీవుడ్ హీరోను తీసుకోవాలని జక్కన్న భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రేక్షకుల అంచనాలకు అందని స్థాయిలో ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమాతో దర్శకునిగా రాజమౌళి మరో మెట్టు పైకి ఎక్కడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గత సినిమాల విషయంలో వ్యక్తమైన విమర్శలను దృష్టిలో ఉంచుకుని మహేష్ సినిమా విషయంలో జక్కన్న మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

2025 సంవత్సరం ప్రథమార్థంలో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని తెలుస్తోంది. కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సంచలనాలను సృష్టించడం ఖాయమని మహేష్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి మహేష్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus