Kiara-Siddharth: ఆ కారణంతోనే కియారా.. మహేష్ ఫ్యామిలీని వెడ్డింగ్ కు ఆహ్వానించలేదట..!

  • February 6, 2023 / 07:30 PM IST

కియారా అద్వానీ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. యం.యస్. ధోని సినిమాలో సాక్షి పాత్రలో చాలా చక్కగా నటించింది. ధోని మీద అభిమానంతో ఆ సినిమాని తెలుగు ప్రేక్షకులు కూడా భారీగానే చూశారు. ఈ క్రమంలో సాక్షి పాత్ర పోషించిన అమ్మాయి ఎవరో చాలా బాగుంది. ఆమెను తెలుగు సినిమాల్లోకి ఏ దర్శకుడైనా తీసుకొస్తే బాగుణ్ణు అని చాలా మంది ప్రేక్షకులు అనుకున్నారు. అది దర్శకుడు కొరటాల విన్నాడనుకుంట.

వెంటనే ‘భరత్ అనే నేను’ సినిమాతో కియారాని తెలుగు సినిమాల్లోకి తీసుకొచ్చాడు. సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ వెంటనే ఆమెకు రాంచరణ్ తో ‘వినయ విధేయ రామ’ సినిమాలో అవకాశం దక్కింది. ప్రస్తుతం చరణ్ – శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉండగా.. కియారా కొంతకాలంగా బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న వీరి వివాహం జరుగుతుందని ప్రచారం జరిగింది.

అయితే అందుకు ఒక్క రోజు ఆలస్యంగా ఫిబ్రవరి 7న వీరి వివాహం జరగనుంది. అయితే కియారా తన వివాహానికి టాలీవుడ్ నుండి రాంచరణ్ దంపతులను మాత్రమే ఆహ్వానించింది. దీంతో ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. నిజానికి ఆమెను టాలీవుడ్ కు తీసుకొచ్చింది నమ్రత శిరోద్కర్. బాలీవుడ్లో తన రిఫరెన్స్ ను వాడి తన భర్త సినిమా కోసం ఆమెను టాలీవుడ్ కు తీసుకొచ్చింది. మరెందుకు మహేష్ ఫ్యామిలీని ఆమె పెళ్ళికి ఆహ్వానించలేదు.

అందుకు కారణం కూడా లేకపోలేదు. గతేడాది చివర్లో మహేష్ తల్లి ఇందిర, తండ్రి కృష్ణ మరణించారు. కాబట్టి వాళ్ళు ఏడాది వరకు ఎటువంటి శుభకార్యానికి హాజరుకాకూడదట. కియారా… నమ్రత బంధుమిత్రుల ద్వారా ఈ విషయాన్ని తెలుసుకుని.. పెళ్ళికి వారిని అధ్వనించలేదని తెలుస్తుంది.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus