మహేష్ ‘మహర్షి’ కి బ్రేక్ పడిందా..?

  • January 7, 2019 / 07:46 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ‘మహర్షి’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భాల కారణంగా ఈ చిత్ర షూటింగ్ కి కొంత విరామం తీసుకుని తన కుటుంబంతో కలిసి దుబాయ్ వెళ్ళాడు. తాజాగా అక్కడ సానియా మీర్జా, షోయబ్ మాలిక్ తో ఫోటోలు కూడా దిగడం విశేషం. ఇప్పుడు ఆ ఫోటోలు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి.

ఇక మహేష్ అండ్ ఫ్యామిలీ ఈ వారంలోనే తిరిగి హైదరాబాద్ రాబోతున్నారట. వచ్చిన తరువాత ‘మహర్షి’ చిత్ర తదుపరి షెడ్యూల్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ చాలా వరకు పూర్తయినట్టు తెలుస్తుంది. ఒక లాంగ్ షెడ్యూల్ కోసం మహర్షి చిత్రబృందం త్వరలో పొల్లాచి కూడా వెళ్ళబోతుందని తెలుస్తుంది. దిల్ రాజు, అశ్వినీదత్, పీ.వీ.పి ప్రసాద్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఉగాది మరియు సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5 న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించేసింది కూడా..! రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతమందిస్తున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus