‘మహర్షి’ బిజినెస్ భారీగానే జరుగుతుంది..!

  • April 2, 2019 / 12:53 PM IST

వంశీ పైడిపల్లి డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘మహర్షి’. దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి… వంటి బడా నిర్మాతలు కలిసి నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా మే 9 న విడుదల కాబోతుంది. ఇది మహేష్ బాబు కు 25 వ చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ చిత్రం యొక్క డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ సంస్థ 11 కోట్ల రూపాయలకు భారీగా కొనుగోలు చేసిందట.

ఇక ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ ను కూడా భారీ మొత్తానికి జెమినీ టీవీ 16.8 కోట్లు పెట్టి కొనుగోలు చేసిందని సమాచారం. రిలీజ్ కాకుండానే ఈ బిజినెస్ తో నిర్మాతలకి చాలా వరకూ పెట్టుబడి వెనక్కి వచేసినట్టే. ఇక తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతుందని సమాచారం. అంతా బానే ఉన్నా ఒక్క ఓవర్సీస్ లో మాత్రమే ఈ చిత్రం బిజినెస్ సరిగా జరగట్లేదని సమాచారం. నిర్మాతలు 18 కోట్లు చెబుతుంటే అక్కడి బయ్యర్లు మాత్రం 12 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారట. ఇంకా డిస్కషన్లు జరుగుతూనే ఉన్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus