Malliswari: ‘మల్లీశ్వరి’ కి 22 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

విక్టరీ వెంకటేష్ హీరోగా కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో ‘నువ్వు నాకు నచ్చావ్’ వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత ‘మల్లీశ్వరి'(Malliswari) అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని డా.డి.రామానాయుడు సమర్పణలో ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థపై డి.సురేష్ బాబు నిర్మించారు. కోటి సంగీత దర్శకుడు. 2004 ఫిబ్రవరి 18న రిలీజ్ అయ్యింది ‘మల్లీశ్వరి’.

Malliswari

మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పెళ్లికాని ప్రసాద్ గా వెంకటేష్ చేసిన కామెడీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 22 ఏళ్ళు పూర్తి కావస్తున్న నేపథ్యంలో టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 4.05 cr
సీడెడ్ 2.01 cr
ఉత్తరాంధ్ర 1.31 cr
ఈస్ట్ 1.01 cr
వెస్ట్ 0.78 cr
గుంటూరు 1.12 cr
కృష్ణా 1.01 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.97 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +  ఓవర్సీస్  0.53 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 12.5 cr(షేర్)

‘మల్లీశ్వరి’ సినిమా రూ.9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.12.51 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా బయ్యర్స్ కి రూ.3.51 కోట్ల లాభాలు పంచి సూపర్ హిట్ అనిపించుకుంది. అన్ సీజన్లో రిలీజ్ అయినప్పటికీ ‘మల్లీశ్వరి’ ఈ స్థాయిలో కలెక్ట్ చేయడం అంటే చిన్న విషయం కాదు అనే చెప్పాలి.

ఆ ఫోన్ కాల్ నన్ను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది : జగపతి బాబు

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus