Mamta Mohandas: 15 ఏళ్ల తర్వాత ఆ పని చేసిన యమదొంగ హీరోయిన్..?

  • April 29, 2021 / 07:57 PM IST

స్టార్ సింగర్ గా, హీరోయిన్ గా ఇండస్ట్రీలో అనతి కాలంలోనే మమతా మోహన్ దాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాలకు దూరంగా ఉన్న మమతా మోహన్ దాస్ 15 సంవత్సరాల తర్వాత బైక్ రైడ్ చేసి వార్తల్లో నిలిచారు. రాఖీరాఖీరాఖీ, ఆకలేస్తే అన్నం పెడతా లాంటి హిట్ సాంగ్స్ పాడటం వల్ల సింగర్ గా మమతా మోహన్ దాస్ పేరు టాలీవుడ్ లో మారుమ్రోగింది.

యమదొంగ సినిమాలో మమతా మోహన్ దాస్ తన నటనతో ఎన్టీఆర్ కు గట్టి పోటీ ఇచ్చారు. నాగార్జున సినిమాల్లో మమతా మోహన్ దాస్ ఎక్కువగా నటించగా బ్రెస్ట్ క్యాన్సర్ రావడం వల్ల ఈమె కొన్నేళ్లు సినిమాలకు దూరమయ్యారు. కీమో థెరపీ చికిత్సతో క్యాన్సర్ నుంచి కోలుకున్న మమతా మోహన్ దాస్ కు రీఎంట్రీలో తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. తాజాగా పోస్ట్ చేసిన వీడియోలో మమతా మోహన్ దాస్ స్టైలిష్ గా బైక్ నడిపారు. 15 సంవత్సరాల తరువాత బైక్ రైడ్ చేస్తున్నానని ఈ అనుభవం అమేజింగ్ గా ఉందని మమతా మోహన్ దాస్ పేర్కొన్నారు.

కెరీర్ తొలినాళ్లలో తాను బైక్ నడిపేదానినని మమతా మోహన్ దాస్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ హీరోయిన్ లాల్ బాగ్ అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుంది. మలయాళంలో మమతా మోహన్ దాస్ చేతిలో ఆరు కంటే ఎక్కువ సినిమాలు ఉన్నాయి.కరోన వల్ల షూటింగ్ లు ఆగిపోవడంతో మమతా మోహన్ దాస్ బైక్ రైడ్ చేస్తూ వార్తల్లో నిలిచారు. ఎన్టీఆర్ హీరోయిన్ బైక్ రైడ్ వీడియో తెగ వైరల్ అవుతుండగా ఈ వీడియోకు 75 వేలకు పైగా లైకులు రావడం గమనార్హం.

1

2

3

4

5

6


Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus