Manchu Manoj: మనోజ్ దంపతుల మంచి మనస్సుకు ఫిదా అవ్వాల్సిందే.. ఏమైందంటే?

  • January 9, 2024 / 12:35 PM IST

మంచు మనోజ్ కెరీర్ పరంగా మళ్లీ బిజీ అవుతున్న సంగతి తెలిసిందే. మనోజ్ హోస్ట్ గా ఈటీవీ విన్ యాప్ లో ఉస్తాద్ షో ప్రసారం అవుతుండగా ఈ షోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు మనోజ్ వాట్ ది ఫిష్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా మనోజ్ దంపతులు మరోసారి మంచి మనస్సు చాటుకోగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మనోజ్ దంపతులు అనాథ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడంతో పాటు స్వయంగా వడ్డించడం గమనార్హం. మౌనిక ప్రెగ్నెన్సీ ధరించిన తర్వాత మనోజ్ దంపతులు అనాథాశ్రమాన్ని సందర్శించి వాళ్లకు మంచి భోజనాలు అందించడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. మనోజ్ కొత్త సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. ఈ ఏడాదే ఈ సినిమా రిలీజయ్యే ఛాన్స్ ఉంది. మనోజ్ పారితోషికం కూడా పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

మంచు మనోజ్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో మనోజ్ రేంజ్ మరింత పెరగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మనోజ్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఉస్తాద్ షోకు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. మనోజ్ కు ప్రేక్షకుల్లో సైతం ఎంతో పాజిటివిటీ ఉంది.

సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మనోజ్ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను సృష్టిస్తారని చెప్పవచ్చు. మనోజ్ కు సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. మంచు మనోజ్ దంపతులు అనాథాశ్రమంలో చిన్నారులకు అవసరమైన వస్తువులను కూడా అందజేశారని సమాచారం అందుతోంది. మామగారి పుట్టినరోజును స్మరించుకుంటూ మనోజ్ (Manchu Manoj) దంపతులు ఈ కార్యక్రమాలను నిర్వహించారని తెలుస్తోంది.

 

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus