Sai Dharam Tej, Manchu Manoj: మనోజ్ ట్వీట్ పై విమర్శలు.. సాయి ధరమ్ తేజ్ నోరు విప్పుతాడా?

Advertisement

ఊర్లల్లో పంచాయితీలు రచ్చబండ దగ్గర జరిగేవి, టౌన్ లేదా సిటీల్లో అయితే పోలీస్ స్టేషన్ లేదంటే కోర్టుల్లో జరుగుతాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

Sai Dharam Tej

ఇప్పుడు పంచాయితీలు అన్నీ ఎక్కువగా సోషల్ మీడియాల్లో జరుగుతున్నాయి.ముఖ్యంగా ఎక్స్(X లేదా ట్విట్టర్) లో ఇలాంటి పంచాయితీలు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం.

ఒక నేరానికి న్యాయస్థానం ఎలా రియాక్ట్ అవుతుందో తెలీదు కానీ సోషల్ మీడియా మాత్రం తీర్పు సిద్ధం చేసేస్తోంది. ఇక్కడ ప్రతి నెటిజెన్ జడ్జె కదా..! ఇటీవల మంత్రి బండి సంజయ్ కుమారుడు అయినటువంటి బండి భగీరథ్‌ ఫోక్సో (POCSO) కేసు నమోదైన సంగతి తెలిసిందే.ఈ అంశం పై హీరో మంచు మనోజ్ పరోక్షంగా ట్వీట్ వేశాడు. ‘న్యాయం అందరికీ సమానంగా దొరకాలి. తప్పు చేసిన వాళ్లకి ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా.. వారిని శిక్షించి బాధితులకి న్యాయం చేయాలని’ మంచు మనోజ్ ట్వీట్లో పేర్కొన్నాడు.

అయితే ఈ విషయంలో మనోజ్ స్నేహితుడు అయినటువంటి సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) అలియాస్ సాయి దుర్గ తేజ్ మాత్రం మౌనం పాటిస్తున్నాడు. గతంలో ఓ యూట్యూబర్.. విదేశాల్లో ఉంటున్న తండ్రీ కూతురిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని మృగాలతో పోలుస్తూ ట్వీట్ చేసి.. వాళ్ళని అరెస్ట్ చేయించే రేంజ్ కి వెళ్లిన సాయి ధరమ్ తేజ్.. బండి సంజయ్ కొడుకు పై ఫోక్సో కేసు నమోదైతే ఎందుకు ప్రశ్నించలేదు అంటూ నిలదీస్తున్నారు నెటిజెన్లు.

‘బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళపై బాగానే రెచ్చిపోయావ్.. మరి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉన్నావ్. పొలిటీషియన్ తో పెట్టుకోవాలంటే భయమా?’ అంటూ సాయి ధరమ్ తేజ్ పై దుమ్మెత్తిపోస్తున్నారు. మరి ఈ విషయంపై తేజు ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ సమస్యలపై బన్నీవాస్ ట్వీట్ వైరల్.. సమస్యపై ఫోకస్ పెడితే బాగుంటుంది !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus