Manchu Vishnu: ‘మా’లో మహిళలకు పెద్ద పీట!

  • October 22, 2021 / 07:55 PM IST

ఎన్నో గొడవలు, ట్విస్ట్ ల మధ్య ‘మా’ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. భారీ మెజారిటీతో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తను అధ్యక్షునిగా గెలిస్తే చాలా చేస్తానని హామీలు ఇచ్చారు మంచు విష్ణు. ఎన్నికైన తరువాత తన మేనిఫెస్టోను అమలు చేసే దిశగా ఒక అడుగు ముందుకేశారు. నిన్న ట్విట్టర్ లో ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నట్లు మంచు విష్ణు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ న్యూస్ ఏమై ఉంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.

ఆ గుడ్ న్యూస్ ఏంటో ఈరోజు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు మంచు విష్ణు. ‘మా’లో మహిళలకు పెద్దపీట వేసినట్లు తెలిపారు. దీనికోసం ఓ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సామాజిక కార్యకర్త, పద్మశ్రీ గ్రహీత సునీత కృష్ణన్ ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా ఉంటారని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘మహిళల ప్రాధాన్యత దృష్ట్యా ‘విమెన్‌ ఎంపర్‌మెంట్‌ అండ్‌ గ్రీవెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నందుకు గర్వంగా ఉంది.

మహిళా సాధికారిత కోసం ఈ కమిటీ ఏర్పాటు చేశాం. పద్మశ్రీ సునీత కృష్ణన్‌ సలహాదారుగా పనిచేయనున్నారు. ఈ కమిటీలో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. వారి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం’ అని అన్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus