Manchu Vishnu: అప్పుడు నాకు సిగ్గేసింది.. అందుకే రానా, బన్నీకి చెప్పి బయటకు వచ్చేశాను : మంచు విష్ణు

టాలీవుడ్ హీరో, హీరోలకి కూడా ఓ కామన్ గ్రూప్ ఉంది. చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. గతంలో ఈ విషయాన్ని మంచు లక్ష్మి (Lakshmi Manchu), నాని (Nani), రానా (Rana Daggubati) వంటి వాళ్ళు పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆ గ్రూప్ లో ఫన్నీ డిస్కషన్స్ తో పాటు తమ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ను కూడా పంచుకుంటామని వారు చెప్పడం జరిగింది.

Manchu Vishnu

2015 లో రానా (Rana Daggubati) – బన్నీ (Allu Arjun) ఈ గ్రూప్ ను స్టార్ట్ చేసినట్టు టాక్ వినిపించింది. ఒక హెల్ది కన్వర్జేషన్స్ కోసం ఈ గ్రూప్ ను ప్రారంభించినట్టు కూడా కొంతమంది ఇండస్ట్రీ జనాలు చెప్పుకొచ్చారు. కానీ ఈ గ్రూప్ నుండి మంచు విష్ణు ఎగ్జిట్ అయిపోయాడట. ఇటీవల బాలీవుడ్లో నిర్వహించిన ‘కన్నప్ప’ (Kannappa) ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు.

మంచు విష్ణు (Manchu Vishnu ) ఈ విషయం పై మాట్లాడుతూ.. “రానా, బన్నీ… ఓ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో దాదాపు 140 మంది హీరో, హీరోయిన్స్ ఉన్నారు. నేను కూడా ఆ గ్రూప్ లో ఉండేవాడిని. తర్వాత బయటకు వచ్చేశాను. ఎందుకంటే అందులో చాలా మంది హీరోయిన్స్ ఉంటారు. ఆ గ్రూప్ లో చాట్ చేయడానికి నాకు కొంచెం సిగ్గుగా అనిపించేది.

అందుకే ఆ వాట్సాప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయ్యాను. ఏదైనా చెప్పాలంటే.. దయచేసి నాకు పర్సనల్ గా మెసేజ్/కాల్ చేయమని రానా (Rana Daggubati), బన్నీ (Allu Arjun) కి చెప్పాను. మేమంతా కలిసే పెరిగాము. సో ఎటువంటి మొహమాటం ఉండదు. ఇప్పటికీ ఏదైనా డిస్కస్ చేయాలంటే .. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తారు” అంటూ చెప్పుకొచ్చాడు.

‘కుబేర’… మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘కుబేర’

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus