బాలీవుడ్ లో ప్రభాస్ కి ఎవరూ మ్యాచ్ కాలేరని చెప్పిన మందిరా బేడీ

  • November 24, 2017 / 10:46 AM IST

యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.   యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 200 కోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ తారలు ఎక్కువమంది  కనిపించనున్నారు. హీరోయిన్ గా శ్రద్ధ కపూర్, విలన్ గా నీల్ నితిన్ ముకేష్, మరికొన్ని కీలక పాత్రలో చుంకే పాండే, జాకీష్రాఫ్, మహేష్ మంజ్రేకర్, మందిర బేడీ, టిన్ను  ఆనంద్ లు  నటిస్తున్నారు. ఈరోజు ఓ మ్యాగజైన్ ఆవిష్కరణ సందర్భంగా మందిరా బేడీ మీడియా ముందుకు వచ్చారు. ఫిట్ గా ఎలా ఉండాలో ? అనే విషయంతో పాటు సాహో మూవీ గురించి అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు. “ఇంతకముందు సినిమాలో హీరో, హీరోయిన్స్ కి మాత్రమే ప్రయారిటీ ఇచ్చే వారు.

ఇప్పుడు దర్శకుల ఆలోచన మారింది. సినిమాలో అనేక పాత్రలు కీలకం అయ్యాయి. ఈ మార్పు బాగుంది. సాహోలో నా రోల్ బాగుంటుంది. అందుకే తొలిసారి తెలుగు మూవీ చేస్తున్నా” అని మందిరా అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ “దక్షిణాది సినీ పరిశ్రమలోని హీరోలందరూ నాకిష్టం. మాధవన్ అయితే నా బెస్ట్ ఫ్రెండ్.” అని చెప్పారు. ప్రభాస్ సినిమాలో నటించడంపై ఎలా ఫీలవుతున్నారు ? అని అడగగా.. అందుకు మందిరా స్పందిస్తూ “బాహుబలి అన్ని రకాలుగా విజయం సాధించింది. ఆ సినిమాని ఎవరూ రీమేడ్ చేయలేరు. చేయాలనుకున్న ప్రభాస్ లాంటి హీరో బాలీవుడ్ లో ఎవరూ లేరు” అని మనసులోని మాటను చెప్పారు.  ” బాహుబలి హీరో ప్రభాస్ కి నేను కూడా పెద్ద ఫ్యాన్. సాహోలో నటించడం చాలా ఎక్సయిటెడ్ గా ఫీలవుతున్నా.” అని వివరించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus