సుమారు మూడు దశాబ్దాల తర్వాత కమల్ హాసన్ (Kamal Haasan) – మణిరత్నం (Mani Ratnam) కలసి ఓ సినిమా చేశారు. అదే ‘థగ్ లైఫ్’(Thug Life). ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి మరో లాంగ్ పెండింగ్ కాంబో గురించి ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ హీరోనే రజనీకాంత్. ఎప్పుడో 1991లో ఇద్దరూ కలసి ‘దళపతి’ (Thalapathi) సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ కలవలేదు.
ఇప్పుడు కమల్తో సినిమా చేయడంతో, రజనీతోనూ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. గతంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన మణిరత్నం.. ఇప్పుడు మరోసారి చెప్పారు. నిజానికి రజనీ (Rajinikanth) – మణిరత్నం సినిమా పుకార్లు రెండేళ్ల క్రితమే వచ్చాయి. ‘పొన్నియిన్ సెల్వన్ 2’ (Ponniyin Selvan 2) సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్కి రజనీకాంత్ వచ్చారు. దీంతో ఈ కాంబోలో మరోసారి సినిమా రానుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎలాంటి రియాక్షన్ లేదు.
ఆ తర్వాత ఇప్పుడేమీ ఉండకపోవచ్చు అని అన్నారు. తాజాగా ఈ పుకార్లపై మణిరత్నం స్పందిస్తూ ‘‘మీరు ఈ విషయాన్ని రజనీకాంత్ను అడగాలి. లేదంటే వేచి చూడాలి. ఏం జరుగుతుందో మనకు తెలియదు’’ అని అన్నారు. దీంతో ఇప్పట్లో సినిమా తేలేలా లేదు అని అంటున్నారు. అయితే, ఆశావాదులు మాత్రం ‘లేదు లేదు ఈ సినిమా ఉంది. మణిరత్నం అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఇలా తేలకుండా చెప్పారు’ అని అంటున్నారు.
అయితే ‘థగ్ లైఫ్’ సినిమా తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు మణిరత్నం చెప్పారు. ఈ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకునే ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాతనే కొత్త సినిమా. ప్రస్తుతం నా దగ్గర నాలుగు స్క్రిప్ట్లు ఉన్నాయి. వాటిలో ఏదీ పూర్తిగా సిద్ధం కాలేదు అని చెప్పారు. అయితే అన్నీ గొప్ప కథలే అని.. పూర్తి స్థాయిలో సిద్ధం చేశాక మాట్లాడతా అని చెప్పారు.