Mani Ratnam: రజనీకాంత్‌తో మరో సినిమా.. మణిరత్నం ఏం చెప్పారంటే?

సుమారు మూడు దశాబ్దాల తర్వాత కమల్‌ హాసన్‌ (Kamal Haasan)  – మణిరత్నం (Mani Ratnam) కలసి ఓ సినిమా చేశారు. అదే ‘థగ్ లైఫ్‌’(Thug Life). ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇలాంటి మరో లాంగ్‌ పెండింగ్‌ కాంబో గురించి ఆ స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ ఎదురుచూస్తున్నారు. ఆ హీరోనే రజనీకాంత్‌. ఎప్పుడో 1991లో ఇద్దరూ కలసి ‘దళపతి’ (Thalapathi) సినిమా చేశారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ కలవలేదు.

Mani Ratnam

ఇప్పుడు కమల్‌తో సినిమా చేయడంతో, రజనీతోనూ సినిమా చేస్తారు అని వార్తలొచ్చాయి. గతంలో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చిన మణిరత్నం.. ఇప్పుడు మరోసారి చెప్పారు. నిజానికి రజనీ (Rajinikanth) – మణిరత్నం సినిమా పుకార్లు రెండేళ్ల క్రితమే వచ్చాయి. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (Ponniyin Selvan 2)  సినిమా ఆడియో లాంచ్‌ ఈవెంట్‌కి రజనీకాంత్‌ వచ్చారు. దీంతో ఈ కాంబోలో మరోసారి సినిమా రానుందని ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ సమయంలో ఎలాంటి రియాక్షన్‌ లేదు.

ఆ తర్వాత ఇప్పుడేమీ ఉండకపోవచ్చు అని అన్నారు. తాజాగా ఈ పుకార్లపై మణిరత్నం స్పందిస్తూ ‘‘మీరు ఈ విషయాన్ని రజనీకాంత్‌ను అడగాలి. లేదంటే వేచి చూడాలి. ఏం జరుగుతుందో మనకు తెలియదు’’ అని అన్నారు. దీంతో ఇప్పట్లో సినిమా తేలేలా లేదు అని అంటున్నారు. అయితే, ఆశావాదులు మాత్రం ‘లేదు లేదు ఈ సినిమా ఉంది. మణిరత్నం అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ కోసం ఇలా తేలకుండా చెప్పారు’ అని అంటున్నారు.

అయితే ‘థగ్‌ లైఫ్‌’ సినిమా తర్వాత కొన్ని రోజులు విరామం తీసుకునే ఆలోచనలో ఉన్నట్లు మణిరత్నం చెప్పారు. ఈ సినిమా తర్వాత కొంతకాలం విరామం తీసుకునే ప్లాన్‌ చేస్తున్నాను. ఆ తర్వాతనే కొత్త సినిమా. ప్రస్తుతం నా దగ్గర నాలుగు స్క్రిప్ట్‌లు ఉన్నాయి. వాటిలో ఏదీ పూర్తిగా సిద్ధం కాలేదు అని చెప్పారు. అయితే అన్నీ గొప్ప కథలే అని.. పూర్తి స్థాయిలో సిద్ధం చేశాక మాట్లాడతా అని చెప్పారు.

శైలేష్‌ కొలను అంతా ఓకే చేసుకునే మొన్న చెప్పారా? భలే ప్లానింగబ్బా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus