తేజు పర్ఫెక్ట్ ప్లానింగ్…!

  • March 11, 2019 / 08:06 PM IST

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరెక్షన్లో ‘చిత్రలహరి’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నివేద పేతురాజ్, కళ్యాణి ప్రియ దర్శన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. గత రెండు సంవత్సరాలుగా హిట్టు లేక తేజు డీలాపడిపోయాడు. ఈ చిత్రంతో ఎలాగైనా హిట్టు కొట్టాలని కృషి చేస్తున్నాడు తేజు. ఇదిలా ఉండగా తేజు త్వరలోనే బిజినెస్ రంగం వైపు అడుగులు వేస్తునట్టు టాక్ వినిపిస్తుంది.

విషయంలోకి వెళితే… ఈ మద్యే కొందరు హీరోలు అటు సినిమాలు చేస్తూనే.. అటు బిజినెస్ వైపు కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, రాంచరణ్, ఎన్టీఆర్, నాగ చైతన్య వంటి హీరోలు బిజినెస్ ల వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తేజు కూడా అదే ప్రయత్నాల్లో ఉన్నాడట. దీని కోసం ప్రత్యేకంగా జూబ్లీ హిల్స్ లోని ‘డ్రైవ్ ఇన్’ అనే ఏరియాలోని ఒక రెస్టారెంట్లో గంటల తరబడి కొందరితో డిస్కషన్లు పెడుతున్నాడట. అయితే అది ఏ బిజినెస్ రంగానికి సంబంచిందనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంది.

ఇక తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను కూడా హీరోగా పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. ‘మైత్రి మూవీస్ వారే’ వైష్ణవ్ తేజ్ ను కూడా లాంచ్ చేస్తున్నారు. ఇప్పటికే తేజు మొహమాటానికి పోయి చాలా మంది ప్లాప్ డైరెక్టర్లకి అవకాశాలిచ్చి చేతులు కాల్చుకున్నాడని మొన్నామధ్య అల్లు అరవింద్ ఓ ఈవెంట్లో ఇండైరెక్ట్ గా కామెంట్ చేసాడు. ఇప్పుడు సినిమాల పరంగానే కాకుండా… ఇటు బిజినెస్ వైపు కూడా కరెక్ట్ ప్లానింగ్ తో తేజు దూసుకుపోవడనికి రెడీ అవుతున్నాడు. మరి తేజు ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus