ఇంటర్వ్యూల టైమ్ లో ఆ విషయాల గురించి మాట్లాడొద్దని అల్టిమేటం

  • March 27, 2019 / 06:13 PM IST

మరో 15 రోజుల్లో ఆంధ్రాలో ఎలక్షన్స్ మొదలవ్వనుండడం, జనసేన ఈసారి ఎలక్షన్స్ లో యాక్టివ్ పార్ట్ ప్లే చేస్తుండడంతో.. మెగా హీరోలందరినీ మీడియా రాజకీయ పరమైన ప్రశ్నలు అడుగుతుండడం కామన్ అయిపోయింది. అయితే.. ఒక రెండ్రోజులుగా వరుణ్ తేజ్, సాయిధరమ్ తేజ్, నీహారికల వ్యవహార శైలి గమనిస్తే.. రాజకీయాల గురించి ఏమాత్రం స్పందించడం లేదు. నీహారిక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నప్పటికీ.. పోలిటికల్ క్వశ్చన్స్ మాత్రం స్కిప్ చేస్తోంది.

అయితే.. ఇదంతా చిరంజీవి ఆదేశాల మేరకు మెగా వారసులందరూ ఫాలో అవుతున్న అల్టిమేటం అని తెలుస్తోంది. తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడం పట్ల చిరంజీవికి పర్సనల్ గా ఎలాంటి ఇష్యూ లేకపోయినప్పటికీ.. రాజకీయంగా మాత్రం తలనొప్పిగా మారింది. దాంతో మెగా వారసులందరినీ ఎలాంటి పోలిటికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయొద్దని చెప్పారట చిరు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus