మాతృమూర్తిని కోల్పోయిన మోహన్ బాబు

  • September 20, 2018 / 05:50 AM IST

విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో పెను విషాదం చోటు చేసుకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ బాబు మాతృమూర్తి మంచు లక్ష్మమ్మ (85) ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె ఆరోగ్యం క్షీణించి ఉండడంతో స్పెషల్ ట్రీట్ మెంట్ ఇప్పించినప్పటికీ లాభం లేకపోయింది. దాంతో ఆమె ఇవాళ ఉదయం 6 గంటలకు తిరుపతిలోని శ్రీవిద్యానికేతన్ లోనే మరణించారు. కానీ.. దురదృష్టవశాత్తూ మంచు కుటుంబ సభ్యులైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్, లక్ష్మీ అందరూ విదేశాల్లో ఉండడంతో.. ఈ విషయం తెలిసిన తర్వాత హుటాహుటిన బయలుదేరారు. ఆమె అంత్యక్రియలు రేపు తిరుపతిలో నిర్వహించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus