ఫిబ్రవరి నుంచి సెట్స్ మీదకు నాగార్జున, నాని మూవీ!

  • December 16, 2017 / 06:56 AM IST

అక్కినేని నాగార్జున యువ హీరోలతో స్క్రీన్ ని షేర్ చేసుకోవడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. తన కుటుంబ హీరోలైన సుమంత్, నాగచైతన్య, అఖిల్ తో మాత్రమే కాకుండా గత ఏడాది తమిళ హీరో కార్తీక్ తో ఊపిరి సినిమా చేసి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు మరో మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. నేచురల్ స్టార్ నానితో కలిసి చేయనున్న సినిమా ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. భలే మంచి రోజు, శమంతకమణి వంటి సినిమాలు చేసిన శ్రీరామ్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో వీరిద్దరూ ఓకే చెప్పారు. దీనికి స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి కావచ్చింది. గతంలో నాగార్జునతో గోవిందా గోవిందా, రావోయి చందమామ.

ఆజాద్ వంటి సినిమాలు నిర్మించిన అస్వినిదత్ ఈ సినిమాని నిర్మించబోతున్నారు.  వైజయంతీ మూవీస్ బ్యానర్ లో చాలా గ్యాప్ తరువాత నాగార్జున చేస్తున్న ఈ సినిమా మొదలుకాకముందే ఆసక్తి రేకిస్తోంది. పైగా ఇందులో వరుసగా విజయాలు అందుకుంటున్న నాని నటిస్తుండడంతో క్రేజ్ నెలకొని ఉంది. నాని నటించిన  తాజా సినిమా ఎంసిఎ ఈ నెల 22 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ తరువాత నాని యువ దర్శకుడు మేర్లపాక గాంధీ  21 వ ప్రాజక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి “కృష్ణార్జున యుద్ధం” అని పేరు కూడా ఫిక్స్ చేశారు.  ఈ చిత్రం చేస్తూనే నాగార్జునతో కలిసి నటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus