Mythri Movie Makers: ‘మైత్రి…’ వెనకడుగు.. ఇక నుండీ ఆ ప్రాజెక్టులకి దూరం

Advertisement

టాలీవుడ్లో చాలా ఫాస్ట్ గా నంబర్ వన్ ప్రొడక్షన్ హౌస్‌గా ఎదిగిన నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్'(Mythri Movie Makers). మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి టాలీవుడ్ టాప్ స్టార్స్‌తోనే కాకుండా.. సల్మాన్ ఖాన్, రజినీకాంత్ వంటి పాన్ ఇండియా సూపర్ స్టార్స్‌తోనూ సినిమాలు చేస్తున్న సంస్థగా కూడా నిత్యం వార్తల్లో నిలుస్తుంటుంది ‘మైత్రి’.

Mythri Movie Makers

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు నిర్మిస్తూ ఎంతో మంది కడుపు నింపుతుంది ఈ సంస్థ అనడంలో సందేహం లేదు.అయితే ఈ సంస్థ ఇప్పుడు చాలా ప్రాజెక్టులు క్యాన్సిల్ చేస్తూ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

విషయంలోకి వెళితే.. ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి పెద్ద సినిమా వల్ల ‘మైత్రి’ సంస్థ చాలా నష్టపోయింది. దీనికి ముందు వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కూడా నష్టాలే మిగిల్చింది. అయినప్పటికీ నవీన్, రవి శంకర్లు ఆందోళన చెందడం లేదు. కానీ ప్రస్తుతం మార్కెట్ బాలేదు. ఓటీటీ, శాటిలైట్ వంటి నాన్-థియేట్రికల్ డీల్స్ బాగా తగ్గిపోయాయి.

దీంతో ‘మైత్రీ’ అధినేతలు తమ బిజినెస్ స్ట్రాటజీలని మార్చుకోబోతున్నారు. ఇందులో భాగంగానే మిడ్ రేంజ్ సినిమాలను తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాలని డిసైడ్ అయ్యారట. స్క్రిప్ట్ స్టేజీలో ఉన్న చాలా ప్రాజెక్టులను ఇప్పటికే పక్కన పెట్టేసినట్టు తెలుస్తోంది. వరుణ్ తేజ్, శర్వానంద్, నితిన్ వంటి హీరోలతో చేయాల్సిన ప్రాజెక్టుల నుండి ‘మైత్రి’ తప్పుకుంది. శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా అనిల్ సుంకర చేతుల్లోకి వెళ్ళిన సంగతి తెలిసిందే.

అలాగే ‘టచ్ చేసి చూడు’ ఫేమ్ విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వరుణ్ తేజ్ చేయాల్సిన ‘ఏఐ లవ్ స్టోరీ’ ప్రాజెక్టు కూడా హోల్డ్ లో పడింది. ఇక హీరో నితిన్ కి అడ్వాన్స్ ఇచ్చి లాక్ చేసినప్పటికీ.. ప్రస్తుతానికి అతనితో అనుకున్న కథలను కూడా హోల్డ్ లో పెట్టినట్టు సంచారం. ‘మైత్రి’ లాంటి టాప్ బేనరే ఇలా భయపడి వెనకడుగు వేస్తే.. మిగతా బ్యానర్ల పరిస్థితులు కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.

పాదఘట్టం, ఎర్రసముద్రాలను పక్కన పెట్టేసిన కొరటాల

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus