క్రేజీ ప్రాజెక్ట్‌ గురించి క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన మైత్రీ

  • February 11, 2021 / 11:32 AM IST

‘సలార్‌’ సినిమా అనౌన్స్‌మెంట్‌ రాగానే… ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఆనందంలో మునిగిపోతే, ఎన్టీఆర్‌ అభిమానులు కూసింత నిరాశకు గురయ్యారు. కారణం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ నెక్స్ట్‌ సినిమా ఎన్టీఆర్‌తోనే అని చాలా రోజుల నుంచి వార్తలు వస్తుండటం. ‘కేజీఎఫ్‌ 2’ అయ్యాక ప్రశాంత్‌ నీల్‌ – ఎన్టీఆర్‌ సినిమా మొదలవుతుందని వార్తలు వచ్చాయి. కానీ ‘సలార్‌’ అనౌన్స్‌మెంట్‌ రావడం, సినిమా షూటింగ్‌ మొదలవ్వడంతో ఇక ఎన్టీఆర్‌ సినిమా ఉండదేమో అని కొందరు అనుకున్నారు. అయితే అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్‌ శుభవార్త చెప్పింది.

ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్ సినిమా ఇంకా కార్డ్స్‌లోనే ఉందట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి నేపథ్య పనులు జరుగుతున్నాయట. ‘సలార్‌’ సినిమా అయిపోగానే ఎన్టీఆర్‌ సినిమా పనులు మొదలుపెట్టేలా ప్రశాంత్‌ నీల్‌ ప్లాన్స్‌ రెడీ చేసుకున్నాడట. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఈ విషయాన్ని నిర్మాతల నవీన్‌ ఎర్నేని, రవిశంకర్‌ యలమంచిలి తెలిపారు. ఈ మాట విన్న ఎన్టీఆర్‌ అభిమానులు ఆ విషయాన్ని ఆనందంగా షేర్‌ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ సినిమా కూడా ట్రాక్‌లో ఉందని తెలుస్తోంది. ‘సలార్‌’ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రశాంత్‌ నీల్ ఆలోచిస్తున్నాడు. అంటే మరి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ ఏ సినిమా చేస్తాడనే ప్రశ్న మరోసారి ముందుకొచ్చింది. త్రివిక్రమ్‌ సినిమా ఈలోపు మొదలుపెట్టేస్తే ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడిపోతుంది.

Most Recommended Video

వామ్మో.. సుమంత్ ఇన్ని హిట్ సినిమాలను మిస్ చేసుకున్నాడా..!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
ఈ 10 మంది బుల్లితెర సెలబ్రిటీలు 30 ఏళ్ళ వయసొచ్చినా పెళ్లి చేసుకోలేదట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus