ఎన్టీఆర్ తో మల్టీ స్టారర్ సినిమాకి సై అంటున్న నాగ చైతన్య

  • July 10, 2017 / 02:13 PM IST

కెరీర్ మొదల్లో కొంత తడబడినా ఇప్పుడు సరైన ట్రాక్ లోకి వచ్చారు నాగచైతన్య. ప్రేమమ్, రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాలతో విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం యుద్ధం శరణం సినిమా చేస్తున్నారు. ఈ షూటింగ్ లో బిజీగా ఉన్న చైతూని మల్టీ స్టారర్ మూవీ ఎప్పుడు చేస్తారని ప్రశ్నిస్తే ఆసక్తికర సమాధానం చెప్పారు. ఎన్టీఆర్ తో కలిసి నటించడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వివరించారు. మంచి కథ దొరికితే చేస్తానని వివరించారు. అప్పట్లో అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారకరామారావు కలిసి నటించిన ‘గుండమ్మ కథ’ సూపర్ హిట్ కొట్టింది.

ఆ సినిమాను బాలకృష్ణ, నాగార్జునలతో రీమేక్ చేయాలని చాలామంది ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఈ సినిమాను ఎన్టీఆర్, నాగ చైతన్యలతో చేస్తే చూడాలని నందమూరి, అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు. వారి కోరిక నెరవేరే సమయం దగ్గర పడింది. నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇటువైపు లైన్ క్లియర్ అయింది. ఇక ఎన్టీఆర్ ఒకే చెబితే ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కడం గ్యారంటీ. ఆ శుభ సమయం త్వరలోనే రావాలని కోరుకుందాం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus