Naga Chaitanya, Pooja Hegde: 7ఏళ్ళ తర్వాత రిపీట్ కాబోతున్న ‘ఒక లైలా కోసం’ కాంబో..!

  • February 17, 2022 / 08:25 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో శింబు, కళ్యాణి ప్రియదర్శన్ హీరో హీరోయిన్లుగా ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా నటించిన సైఫై థ్రిల్లర్‌ ‘మానాడు’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సురేష్ కామాక్షి నిర్మించారు. నవంబర్ 25న విడుదలైన ఈ చిత్రం… 2021వ సంవత్సరానికి గాను కోలీవుడ్లో అత్యధిక గ్రాస్ వసూళ్ళని రాబట్టి రికార్డులు సృష్టించింది.ఈ చిత్రం రీమేక్ రైట్స్ మావంటే మావంటూ రెండు బడా నిర్మాణ సంస్థలు పోటీ పడిన సంగతి తెలిసిందే.

Click Here To Watch

చివరికి ‘సురేష్ ప్రొడక్షన్స్’ సంస్థ ఈ చిత్రం రీమేక్ మరియు డబ్బింగ్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఈ ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి వివరాలను త్వరలోనే తెలియజేస్తామని కూడా అప్పుడు ఈ సంస్థ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం… ఈ రీమేక్ కు హీరోగా నాగ చైతన్య ఎంపికనట్టు సమాచారం. హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. గతంలో వీళ్ళిద్దరూ కలిసి ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటించారు.

పూజా హెగ్డేకి తెలుగులో అదే మొదటి చిత్రం. అది మంచి ఫలితాన్నే అందుకుంది. ఇప్పుడు మరోసారి ‘మనాడు’ కోసం జతకట్టనున్నారన్న మాట. అయితే ఒరిజినల్లో హీరోయిన్ పాత్రకి అంత స్కోప్ ఉండదు. ఎస్.జె.సూర్య పాత్రే కీలకం. మరి తెలుగులో ఆ పాత్రకి ఎవర్ని ఎంపిక చేసుకుంటారో. అసలు ఈ రీమేక్ ను ఏ దర్శకుడు తెరకెక్కిస్తాడు? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus