మెగా హీరోలతో సన్నిహితంగా ఉన్న నాగశౌర్య

  • August 24, 2018 / 07:36 AM IST

సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకోవడానికి ఎవరోఒకరి సపోర్ట్ ఉంటే సులువు అవుతుంది. మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఉంటే తిరుగుండదు. చిరు తన కుటుంబంలోని హీరోలని మాత్రమే కాదు.. తనని స్ఫూర్తి గా తీసుకున్న ప్రతి ఒక్కరికీ తోడుగా నిలుస్తుంటారు. ఎంత బిజీగా ఉన్నా వారి సినిమా వేడుకలకి హాజరై తన అభిప్రాయాన్ని చెప్పి అంచనాలను పెంచుతుంటారు. అలాగే నాగశౌర్య కి కూడా చిరు సపోర్ట్ గా నిలిచారు. ఆ అభిమానంతోనే నాగశౌర్య మెగా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉంటున్నారు. “ఛలో” ప్రీరిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవిని ఆహ్వానించి ఆయన ఆశీస్సులు తీసుకొని ఘన విజయం సాధించారు. శౌర్య దాన్ని సెంటిమెంట్ గా భావించాడో ఏమో గానీ ఈ సారి తన “@నర్తనశాల” చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్ ను అతిథిగా ఆహ్వానించాలనుకున్నాడు.

అయితే చరణ్ కు బిజీ షెడ్యూల్స్ కారణంగా వెళ్ళడం కుదరడం లేదు. వీలున్నప్పుడు మరోసారి తప్పకుండా వస్తానని నాగశౌర్యకి ప్రామిస్ చేశారు. ప్రామిస్ కు అనుగుణంగానే ఇటీవల చెర్రీ నాగశౌర్య తో దాదాపు ఒక గంట సేపు ముచ్చటించారు. ఈ అనుబంధం వల్ల మెగా అభిమానులందరూ నాగశౌర్య ని తమ హీరోగా భావిస్తున్నారు. వారి వల్ల ఈ సినిమాకి కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. శ్రీనివాస చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 30 న రిలీజ్ కానుంది. యామిని భాస్కర్‌ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఏమేర విజయాన్ని అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus