260 ర్యాంక్ సాధించిన కింగ్ నాగార్జున

  • August 19, 2017 / 01:35 PM IST

అక్కినేని నాగార్జున సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. ట్విట్టర్ లో నిరంతరం అభిమానులతో టచ్ లో ఉంటూ సినిమా, కుటుంబ సంగతులను షేర్ చేసుకుంటూ రోజురోజుకి ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు.  అందుకే నాగ్ ని అనుసరించేవారు సంఖ్య 3 మిలియన్ కు చేరుకుంది. తెలుగు చిత్ర పరిశ్రమలోనాగ్ కంటే ముందు మహేష్ బాబు మూడు మిలియన్ ఫాలోవర్స్ ని దాటేసారు. ఇప్పడు అతన్ని అనుసరిస్తున్న వారి సంఖ్య 3.6 మిలియన్ గా ఉంది. ఆ మార్క్ ని కూడా నాగార్జున త్వరలో దాటేలా కనిపిస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న జాబితాలో నాగ్ 260వ ర్యాంకు దక్కించుకున్నారు.

రోజూ 5 వేల మంది కొత్త ఫాలోయర్స్ ని ఆకట్టుకుంటూ నాగ్ ట్విట్టర్ ఖాతా 30 లక్షలకు చేరుకుందని ‘ట్విట్ట‌ర్ కౌంట‌ర్‌’అనే వెబ్‌ సైట్ వారు ఈ విషయాన్నీ వెల్లడించగా.. అందుకు నాగార్జున స్పందిస్తూ “ఇంత అభిమానం చూపిస్తున్నందుకు కృత‌జ్ఞ‌త‌లు” అంటూ స‌మాధాన‌మిచ్చారు. ప్రస్తుతం నాగార్జున రాజుగారి గది 2 లో నటిస్తుండగా, అఖిల్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పనులతో పాటు పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus